Renu Desai : వర్దమాన నటి, ప్రముఖ యాక్టర్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai ) సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె గత కొంత కాలం నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు. తాజాగా భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న పరిస్థితులపై స్పందించారు. గత నెల ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో 26 మంది పర్యాటకులను పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాలు అత్యంత దారుణంగా కాల్చి చంపారు. ఆ తర్వాత భారత్ ప్రతీకార దాడులకు తెగబడింది.
Renu Desai Shocking Post
పాకి ఆక్రమిత కశ్మీర్ లో ఉగ్రవాదుల స్థావరాలను మట్టుబెట్టింది. 110 మందికి పైగా ఉగ్రవాదులను, టాప్ లీడర్లను హతం చేశారు. అంతే కాకుండా పాకిస్తాన్ కు చుక్కలు చూపించారు. భారత్ దాడుల దెబ్బకు విల విల లాడింది దాయాది దేశం. ఈ సందర్బంగా సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున పాక్, భారత్ దేశాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. వీటి వల్ల మంచి కంటే చెడే ఎక్కువగా ఉందని వాపోయింది నటి రేణు దేశాయ్.
సినీ సెలబ్రిటీలు, ప్రముఖులు భారత్ కు మద్దతుగా నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూనే ఆందోళన
చెందుతున్నట్లు పేర్కొన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా, అసలు ఏమిటో ధ్రువీకరించు కోకుండా ఇలాంటి ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తే ఎలా అని మండిపడింది నటి. ప్రధానంగా రీల్స్ , వ్యూస్ కోసం ఇలా చేస్తారా, నీచానికి దిగుతారా అంటూ ప్రశ్నించారు రేణు దేశాయ్. ఇది మంచి పద్దతి కాదని సూచించింది.
Also Read : Hero Ram Pothineni-Upendra :అందరి వాడు సూర్య కుమార్