మాన‌ని గాయం మ‌యాంక్ ఐపీఎల్ కు దూరం

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు

ముంబై – ప్ర‌పంచ క్రికెట్ లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ఏకైక టోర్నీ ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్). ప్ర‌స్తుతం 18వ సీజ‌న్ కొన‌సాగుతోంది. భార‌త్, పాక్ ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డింది. ఇరు దేశాల మ‌ధ్య శాంతి చ‌ర్చ‌ల ప్ర‌క్రియ ప్రారంభం కావ‌డంతో తిరిగి నిర్వ‌హిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా.

తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఐపీఎల్ లో అత్య‌ధిక వేగంతో బంతులు వేసే బౌల‌ర్ గా గుర్తింపు పొందాడు మ‌యాంక్ యాద‌వ్. త‌ను 156.7 కి.మీ గంట‌కు విసురుతున్నాడు. ఇది భార‌తీయ బౌల‌ర్ల‌లో ఓ రికార్డ్. వెన్ను గాయం కావ‌డంతో ఫిట్ నెస్ ప‌రీక్ష‌లో పాస్ కాలేదు. ఈ విష‌యాన్ని గుర్తించిన బీసీసీఐ త‌న‌ను ఐపీఎల్ టోర్నీకి దూరంగా ఉండాల‌ని సూచించింది. దీంతో మ‌నోడు మ‌రో బ్రేక్ డౌన్ కు గుర‌య్యాడు.

ఈ సంద‌ర్బంగా ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ బాడీ చైర్మ‌న్ అరుణ్ ధుమాల్ స్పందించాడు. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు. మ‌యాంక్ యాద‌వ్ వెన్ను నొప్పితో బాధ ప‌డుతున్నాడు. ఈ సీజ‌న్ తో పాటు భార‌త్ ఆడే ఇత‌ర మ్యాచ్ ల‌కు దూరం కానున్నాడ‌ని ప్ర‌క‌టించాడు. ఇది ఒక ర‌కంగా బాధాక‌ర‌మ‌ని పేర్కొన్నాడు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com