తిరుమల – శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పింది టీటీడీ. ప్రతి రోజూ వేలాది మంది శ్రీవారిని దర్శించుకుంటున్నారు. వందలాది వాహనాలు నిత్యం భక్తులను చేరవేస్తున్నాయి. ఈ సందర్బంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అత్యాధునిక వసతి సౌకర్యాలతో తిరుమలలో బస్టాండ్ ను తీర్చిదద్దనుంది. ఈ మేరకు టీటీడీ పాలక మండలి తీర్మానం చేసింది. ఇందు కోసం ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నట్లు వెల్లడించింది .
బస్ టెర్మినల్ కోసం ఏకంగా రూ. 500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. అన్ని వసతులు ఒకేచోట లభించేలా తీర్చిదిద్దనున్నారు. ఈ బస్ టెర్మినల్ ను తిరుమల పేరుతో తిరుపతి బస్టాండ్ ను నిర్మిస్తారు. గ్రౌండ్ ఫ్లోర్ లో బస్టాండును, 10 అంతస్తుల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మెట్రీలు ఉండేలా ప్లాన్ చేశారు. ఈ మేరకు స్థలాన్ని ఆర్టీసీ కేటాయించనుంది.
కేంద్ర ప్రభుత్వ సంస్థతో పాటు టెండర్ వేసి ప్రైవేట్ గుత్తేదారుకు దీని నిర్మాణ బాధ్యతలను అప్పగించనున్నారు. ప్రస్తుతం తిరుపతి బస్టాండ్ సరి పోవడం లేదు. ఇతర రాష్ట్రాలతో పాటు ఏపీ నుంచి వచ్చే బస్సులతో క్రిక్కిరిసి పోతోంది. రద్దీకి అనుగుణంగా బస్సులు నడపాల్సి వస్తోంది. నిత్యం కళ్యాణం లాగానే ఉంటోంది తిరుమల పుణ్య క్షేత్రం. మొత్తంగా ఇంట్రా మోడల్ బస్ టెర్మినల్ ను నిర్మించనున్నారు. ఇంకా ఫైనల్ కాలేదు. త్వరలోనే ఆమోదం పొందే ఛాన్స్ ఉంది.