తిరుమల – భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు పలువురు సినీ రంగానికి చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు దర్శించుకున్నారు. స్వామి సన్నిధిలో సేదదీరారు. గంభీర్ తో పాటు ప్రముఖ సినీ నటి ఐశ్వర్య రాజేశ్, వైభవ్, ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ దర్శించుకున్న వారిలో ఉన్నారు. ఇదిలా ఉంగా గంభీర్ కు ఘన స్వాగతం పలికారు ఆలయ అధికారులు. ఉదయం వేళలో శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు . స్వామి వారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం గంభీర్ కుటుంబానికి, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులకు టీటీడీ ఉన్నతాధికారులు స్వామి వారి చిత్ర పటాన్ని, తీర్థ ప్రసాదాలను అందజేశారు. వీరితో పాటు భారత దేశ మాజీ ప్రధాన మంత్రి దేవగౌడ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో స్వామిని దర్శించుకున్నారు. వీరికి విస్తృత ఏర్పాట్లు చేశారు.
అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. సరిహద్దుల్లో సమస్యలు తీరాలని ప్రధాని మోదీ, భారత సైనికులకు శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు ఈ సందర్బంగా. ఇదిలా ఉండగా వేసవి కాలం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది.