చ‌క్ దే పంజాబ్ రాజ‌స్థాన్ కు ఝ‌ల‌క్

10 ప‌రుగుల తేడాతో రాయ‌ల్స్ ప‌రాజ‌యం

రాజ‌స్థాన్ – రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు ఈసారి జ‌రుగుతున్న ఐపీఎల్ సీజ‌న్ అచ్చి రాలేదు. ఆ జ‌ట్టు ఈ టోర్నీలో మూడు మ్యాచ్ ల‌ను 1, 2 ప‌రుగుల తేడాతో కోల్పోయింది. తాజాగా జైపూర్ వేదిక‌గా జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ చేతిలో 10 ర‌న్స్ తేడాతో ఓట‌మి పాలైంది. 220 ప‌రుగుల భారీ టార్గెట్ ను ఛేదించే క్ర‌మంలో చివ‌రి వ‌ర‌కు పోరాడినా ఫ‌లితం లేకుండా పోయింది. ఆఖ‌రున ధ్రువ్ జురైల్ ఫైట్ చేసినా గ‌ట్టెక్కించ లేక పోయాడు. ఇక సంజూ శాంస‌న్ నిరాశ ప‌రిచాడు.

త‌ను కేవ‌లం 20 ర‌న్స్ చేసి పెవిలియ‌న్ బాట ప‌ట్టాడు. జైశ్వాల్ 50 తో దుమ్ము రేపితే యంగ్ క్రికెట‌ర్ వైభ‌వ్ సూర్య వంశీ మ‌రోసారి త‌న స‌త్తా ఏమిటో చూపించాడు. కేవ‌లం 15 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు 4 సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. 40 ప‌రుగులు చేశాడు. చివ‌రలో పంజాబ్ బౌల‌ర్లు అద్భుతంగా బౌలింగ్ చేయ‌డంతో రాజ‌స్థాన్ గెలుపు వాకిట బోర్లా ప‌డింది.

ఇక పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ సూప‌ర్ షో చేసింది. శ్రేయ‌స్ అయ్య‌ర్ అద్భుత‌మైన నాయ‌క‌త్వం విజ‌యం సాధించేలా చేసింది. అంత‌కు ముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 219 ర‌న్స్ చేసింది. నేహాల్ వ‌ధేరా దుమ్ము రేపాడు. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. త‌ను 70 ర‌న్స్ చేయ‌గా డెత్ ఓవ‌ర్ల‌లో శ‌శాంక్ సింగ్ 59 ర‌న్స్ పిండుకున్నాడు. అయ్య‌ర్ 30 ర‌న్స్ తో ఆక‌ట్టుకున్నాడు. మొత్తంగా ప్లే ఆఫ్స్ రేసులో ఇంకో మ్యాచ్ గెలిస్తే చాలు వెళుతుంది. ప్ర‌స్తుతం ఆర్సీబీతో స‌మానంగా 17 పాయింట్ల‌తో టాప్ లో నిలిచింది పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com