త్రివిక్ర‌మ్ పై భ‌గ్గుమ‌న్న ముద్దుగుమ్మ

ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోక పోతే ఎలా..?

మాట‌ల మాంత్రికుడు, దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ పై మ‌రోసారి సీరియ‌స్ కామెంట్స్ చేసింది న‌టి పూన‌మ్ కౌర్. త‌నపై గ‌తంలో కీల‌క కామెంట్స్ చేసింది. ఆపై ఫిర్యాదు కూడా చేసింది. తాను త‌న వ‌ల్ల మోస పోయానంటూ వాపోయింది. త‌న‌కు న్యాయం చేయాల‌ని కోరింది. ఎందుక‌ని సినీ ప‌రిశ్ర‌మ మౌనంగా ఉందంటూ ప్ర‌శ్నించింది. సామాజిక మాధ్య‌మం ద్వారా ప్ర‌శ్నించింది. ప‌లు ప్ర‌శ్న‌లు సంధించింది న‌టి.

అయితే సంచ‌ల‌నంగా మారేకంటే ముందు త‌ను కొన్ని సినిమాల‌లో మాత్ర‌మే న‌టించింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్, త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కార‌ణంగా తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాన‌ని, ఆ ఇద్ద‌రి వ‌ల్ల త‌న సినీ కెరీర్ నాశ‌న‌మైంద‌ని వాపోయింది. తాను ఎంత‌గా మొత్తుకున్నా తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ మౌనంగా ఉండ‌డం ప‌ట్లు తీవ్ర స్థాయిలో మండిప‌డింది పూన‌మ్ కౌర్. ద‌ర్శ‌కుడిపై తాను ఫిర్యాదు కూడా చేశాన‌ని కానీ ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ర్య‌లు తీసుకోలేదంటూ వాపోయింది.

తాజాగా త‌న ఇన్ స్టా స్టోరీస్ కేంద్రంగా కీల‌క ఆరోప‌ణ‌లు చేసింది. కొత్త‌గా మ‌రికొన్ని విమ‌ర్శ‌లు చేయ‌డం క‌ల‌కలం రేపింది. ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశా. త్రివిక్ర‌మ్ , ప‌వ‌న్ నుంచి తాను మోస పోయిన విష‌యం ప్ర‌తి ఒక్క‌రికీ తెలుస‌ని ఆ ఇద్ద‌రూ ఇప్పుడు ప‌వ‌ర్ ఫుల్ పోస్టుల‌లో ఉన్నార‌ని తెలిపింది. గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ లో ఝాన్సీతో తాను జ‌రిపిన సంభాష‌ణ‌కు సంబంధించిన స్క్రీన్ షాట్ ను కూడా పంచుకుంది.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com