ఢిల్లీ – భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి అశోక యూనివర్శిటీలో ప్రొఫెసర్ గా పని చేస్తున్న అలీ ఖాన్ వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా తనకు బెయిల్ మంజూరు చేయాలని, విచారణను నిలిపి వేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆయన తరపున ప్రముఖ సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టులో వాదనలు వినిపించారు.
ఈ సందర్బంగా ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాఠాలు చెప్పాల్సిన వాళ్లు ఇతర విషయాలలో జోక్యం ఎందుకు చేసుకోవాలంటూ ప్రశ్నించింది. ఇదే సమయంలో చీప్ పబ్లిసిటీ కోసం ఇలాంటి పోస్టులు పెడితే ఎలా అని నిలదీసింది ప్రొఫెసర్ అలీ ఖాన్ ను. తరగతి గదుల్లో భావి భారత పౌరులను తయారు చేయాల్సిన మీరు ఇలాంటి చిల్లర అంశాల గురించి ఎందుకు ఫోకస్ పెడుతున్నారంటూ మండిపడింది. ఇదేనా మీకు నేర్పింది. ఏం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యింది. ఆపరేషన్ సిందూర్ పై ఎందుకు స్పందించాల్సి వచ్చిందో చెప్పాలని పేర్కొంది.
దీంతో కపిల్ సిబల్ తన వాదనలు వినిపించారు. ప్రొఫెసర్ అలీ ఖాన్ ఆపరేషన్ సిందూర్ విషయంలో సోషల్ మీడియాలో చేసిన పోస్టులలో ఎలాంటి వ్యతిరేకత, నేర పూరితమైన వ్యాఖ్యలు లేవంటూ స్పష్టం చేశారు. దయచేసి బెయిల్ మంజూరు చేయాలని కోరారు. చివరకు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూనే పోస్టులు షేర్ చేసే ముందు, రాసే ముందు ముందు వెనుకా ఆలోచించాలని స్పష్టం చేసింది.