గుజరాత్ – అహ్మదాబాద్ వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో ప్లే ఆఫ్స్ లో టాప్ లో కొనసాగుతున్న శుభ్ మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ కోలుకోలేని షాకిచ్చింది రిషబ్ పంత్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్. పోతూ పోతూ 33 పరుగుల తేడాతో ఝలక్ ఇచ్చింది. దీంతో లక్నోపై గెలుపొంది పాయింట్లను పెంచుకోవాలని చూసిన గుజరాత్ ఆశలపై నీళ్లు చల్లింది ఎల్ ఎస్ జి.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగింది లక్నో. స్వంత గడ్డపై గుజరాత్ టైటాన్స్ బౌలర్లను ఉతికి ఆరేశారు లక్నో ప్లేయర్లు. ప్రధానంగా మిచెల్ మార్ష్ చుక్కలు చూపించాడు. కళ్లు చెదిరే షాట్స్ తో విరుచుకు పడ్డాడు. దీంతో లక్నో బౌలర్లు బెంబేలెత్తి పోయారు. చేష్టలుడిగి పోయారు. సూపర్ సెంచరీతో కదం తొక్కాడు. మరో వైపు నికోలస్ పూరన్ పూనకం వచ్చినట్లు ఆడాడు. ఈ ఇద్దరూ కలిసి బౌలర్ల భరతం పట్టారు. మార్ష్ 64 బంతులు ఎదుర్కొని 117 రన్స్ చేశాడు. ఇందులో 10 ఫోర్లు 8 భారీ సిక్సర్లు ఉన్నాయి. నికోలస్ పూరన్ కేవలం 27 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. 56 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 4 ఫోర్లు 5 సిక్సర్లు ఉన్నాయి.
నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 235 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం మైదానంలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ చేతులెత్తేసింది. 9 వికెట్లు కోల్పోయి 202 రన్స్ కే పరిమతమైంది. షారుక్ ఖాన్ 57 , రూథర్ ఫర్డ్ 38 రన్స్ చేశాడు. ఓరూర్కీ 27 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీస్తే ఆయుష్ బదోనీ 4 రన్స్ ఇచ్చి 2 వికెట్లు కూల్చాడు. ఆవేష్ ఖాన్ 51 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు.