ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టారు. రాష్ట్రంలో బతికే పరిస్థితులు లేకుండా పోయాయని ఆరోపించారు. సోషల్ మీడియా వీడియోలపై 22 ఏళ్ల న్యాయ విద్యార్థి షర్మిస్త పనోలి గురించి ప్రస్తావించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో మాట్లాడనందుకు బాలీవుడ్ నటులను లక్ష్యంగా చేసుకుంది.
కోల్కతాలో ఫిర్యాదు చేసిన తరువాత దాఖలు చేసిన షార్మిస్టా పనోలికి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. మతం ఆధారంగా శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, మతపరమైన భావాలను ఆగ్రహానికి గురిచేయడం , శాంతి ఉల్లంఘనను రేకెత్తించే ఉద్దేశ్యంతో ఉద్దేశ పూర్వకంగా అవమానించినట్లు ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు పోలీసులు. అనంతరం కోర్టులో హాజరు పర్చడంతో తనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.
బిజెపిని లక్ష్యంగా చేసుకుని టీఎంసీ సర్కార్ విభజన రాజకీయాల ద్వారా మత పరమైన అల్లర్లను ప్రేరేపించేందుకు ప్రయత్నం చేస్తోందంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు పవన్ కళ్యాణ్. మరో వైపు కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఖండించింది న్యాయ విద్యార్థి అరెస్ట్ ను. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొంది. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు కథనాలను ఆధారంగా చేసుకుని అరెస్ట్ లకు పాల్పడడం దారుణమన్నారు.