బీసీసీఐ తాత్కాలిక అధ్య‌క్షుడిగా రాజీవ్ శుక్లా

త్వ‌ర‌లోనే రోజ‌ర్ బిన్నీ ప‌ద‌వీ కాలం ముగింపు

భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి తాత్కాలిక అధ్య‌క్షుడిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు ప్ర‌స్తుత ఉపాధ్య‌క్షుడిగా ఉన్న రాజీవ్ శుక్లా. త‌ను కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్య‌క్తి. ఆయ‌న‌కే ఎక్కువ‌గా ప్రెసిడెంట్ గా అయ్యేందుకు అవ‌కాశాలు ఉన్నాయ‌ని క్రికెట్ వ‌ర్గాల నుంచి అందిన స‌మాచారం. స్టాండింగ్ ప్రెసిడెంట్ గా శుక్లా జూలై నుండి మూడు నెల‌ల పాటు బాధ్య‌త‌లు స్వీక‌రిస్తారు.

వ‌చ్చే సెప్టెంబ‌ర్ నెల‌లో బీసీసీఐ వార్షిక స‌ర్వ స‌భ్య స‌మావేశం (ఏజీఎం) జ‌ర‌గ‌నుంది ముంబై లేదా ఇత‌ర ప్రాంతంలో. అయితే పూర్తి కాల‌పు ప్రెసిడెంట్ ప‌ద‌వి కోసం రాజీవ్ శుక్లా బ‌రిలో ఉండ‌నున్న‌ట్లు టాక్. అంత‌కు ముందు బీసీసీఐ అధ్య‌క్షుడిగా భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ స్కిప్ప‌ర్ సౌర‌వ్ గంగూలీ ప‌ని చేశారు. కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఆ త‌ర్వాత వ‌ర‌ల్డ్ క‌ప్ 1983 విజేత జ‌ట్టులో స‌భ్యుడిగా ఉన్న క‌ర్ణాట‌క‌కు చెందిన రోజ‌ర్ బిన్నీ బీసీసీఐ చీఫ్ గా ఎన్నిక‌య్యారు.

అయితే ఎవ‌రు ఎన్నికైనా మొత్తం చ‌క్రం తిప్పేదంతా కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా త‌న‌యుడు జే షానేన‌ని బ‌హిరంగ ర‌హ‌స్యం. ఇక బిన్నీ హ‌యాంలోనే భార‌త జ‌ట్టు 2 వైట్ బాల్స్ టైటిళ్ల‌ను , ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను, 2024, ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోపీ 2025ల‌ను గెలుచుకుంది. అంతే కాదు అత్యంత విజ‌య‌వంత‌మైన విమెన్ ప్రిమీయ‌ర్ లీగ్ ను కూడా త‌న హ‌యాంలోనే ప్ర‌వేశ పెట్టారు రోజ‌ర్ బిన్నీ.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com