ఆర్సీబీ విజ‌యోత్స‌వంలో విషాదం

ఏడుగురు మృతి..ప‌లువురి ప‌రిస్థితి విష‌మం

బెంగ‌ళూరు – బెంగ‌ళూరులో బుధ‌వారం నిర్వ‌హించిన ఆర్సీబీ విజ‌యోత్స‌వ ర్యాలీలో విషాదం చోటు చేసుకుంది. చిన్న‌స్వామి స్టేడియం వెలుప‌ల జ‌రిగిన తొక్కిస‌లాట‌లో ఏడుగురు మృతి చెందారు. 50 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు స‌మాచారం. 18 ఏళ్ల త‌ర్వాత జ‌ట్టు గెలుపొంద‌డంలో క‌ర్ణాట‌క క్రికెట్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో విజ‌యోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినా చాలా మంది రావ‌డంతో తొక్కిస‌లాట చోటు చేసుకుంద‌ని, గాయ‌ప‌డిన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు తెలిపారు డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్.

జ‌ట్టు స‌భ్యుల‌ను చూసేందుకు క‌ర్ణాట‌క రాష్ట్రం నుంచి చిన్న స్వామి స్టేడియం వ‌ద్ద‌కు చేరుకున్నారు. వారిని కంట్రోల్ చేయ‌డంలో పోలీసులు విఫ‌లం అయ్యారు. ఈ విజ‌యోత్స‌వ వేడుక చివ‌ర‌కు క‌న్నీళ్లున మిగిల్చింది. జ‌ట్టును స‌త్క‌రించాల‌ని భావించింది కేహెచ్ఏ. గాయ‌ప‌డిన‌, అప‌స్మార‌క స్థితిలో ఉన్న వారిని అంబులెన్సుల‌లో స‌మీప ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. భారీ ఎత్తున అంబులెన్సులు స్టేడియం వ‌ద్ద‌కు చేరుకున్నాయి.

పెద్ద ఎత్తున తొక్కిస‌లాట చోటు చేసుకోవ‌డం వ‌ల్ల‌నే ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌న్నారు డిప్యూటీ సీఎం. ఈ ఘ‌ట‌నపై స్పందించారు సీఎం సిద్ద‌రామ‌య్య‌. విజ‌యోత్స‌వ వేళ ఇలాంటిది చోటు చేసుకోవ‌డం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 5 వేల మందికి పైగా సిబ్బందిని ఏర్పాటు చేశామ‌న్నారు.

ఇదిలా ఉండ‌గా వేడుక‌ల‌ను చూసేందుకు చాలా మంది చెట్లు ఎక్క‌డం, కొమ్మ‌లపై కూర్చోవ‌డంతో పెద్ద ఎత్తున ఇబ్బందులు ఏర్ప‌డ్డాయి. భద్రతా కారణాలను చూపుతూ కర్ణాటక ప్రభుత్వం విధానసౌధ నుండి స్టేడియం వరకు జరగాల్సిన విజయోత్సవ కవాతును రద్దు చేసింది.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com