లవ్లీ బ్యూటీఫుల్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తను తొలుత తమిళంలో సినీ రంగ ప్రవేశం చేసింది. అక్కడి నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది నటుడు వరుణ్ తేజ్ తో కలిసి. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఫుల్ రేంజ్ లో టాప్ లో కొనసాగింది. అగ్ర నటులందరితో సినిమాలు చేసింది. అవి బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. మహేష్ బాబుతో శ్రీమంతుడు, అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాథమ్, అల వైకుంఠ పురంలో, జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత, విక్టరీ వెంకటేశ్ తో ఎఫ్ -2 లో తళుక్కున మెరిసింది. తన రెమ్యునరేషన్ రేంజ్ తారాస్థాయికి చేరుకుంది.
ఇదే సమయంలో తను నటించిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. తమిళంలో దళపతి విజయ్ తో , తాజాగా సూర్యతో రెట్రోలో కీ రోల్ పోషించింది. కానీ వర్కవుట్ కాలేదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి వెళ్లింది. సర్కస్, కిసీ కా భాయ్ కీసీ కా జాన్ , దేవా లాంటి మూవీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. షాహిద్ కపూర్ తో రెచ్చి పోయి నటించింది. రొమాంటిక్ సీన్స్ లో అదుర్స్ అనిపించేలా చేసింది. కానీ సక్సెస్ కాలేదు. సల్మాన్ ఖాన్ తో నటించిన మూవీ పెద్దగా ఆడలేదు.
ఈ సందర్బంగా పూజా హెగ్డే చిట్ చాట్ చేసింది. తన మనసులోని భావాలను పంచుకుంది. సినిమా రంగంలో ఫెయిల్యూర్స్, సక్సెస్ కామన్ అంటూ కొట్టి పారేసింది. దీనిని తాను అంతగా పట్టించుకోనంటూ స్పష్టం చేసింది ఈ ముద్దుగుమ్మ. ఒక్కోసారి ఎంచుకునే కథలు కొంత భిన్నంగా ఉండడం వల్లనే ఫెయిల్యూర్ అవుతున్నట్లు తాను నమ్ముతానని చెప్పింది.