అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన చిత్రం థండేల్ దుమ్ము రేపింది. బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా రూ. 100 కోట్లు కొల్లగొట్టింది. దీని తర్వాత నాగ్ కు బంపర్ ఆఫర్స్ రావడం మొదలైంది. ఇదిలా ఉండగా మూవీ మేకర్స్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో కూడా రిలీజ్ చేశారు. ఆయా ప్రాంతాలలో మంచి స్పందన లభించింది. తాజాగా ప్రముఖ మీడియా , టెలిజన్ సంస్థ సోనీ ప్రీమీయర్ సంచలన ప్రకటన చేసింది.
జూన్ 15వ తేదీ రాత్రి 8 గంటలకు తమ ఛానల్ లో నేరుగా థండేల్ హిందీ వెర్షన్ ను ప్రసారం చేస్తున్నట్లు వెల్లడించింది సామాజిక మాధ్యమాల ద్వారా. దీంతో థండేల్ ను చూడని ప్రేక్షకులకు, నాగ్ ఫ్యామిలీ ఫ్యాన్స్ కు తీపి కబురు చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయండి అంటూ కోరింది. ఆదివారం కావడంతో భారీ ఎత్తున వ్యూయర్స్ చూస్తారని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మొత్తంగా టెలివిజన్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. దర్శకుడు ఈ సినిమాను పూర్తిగా రొమాంటిక్ , సస్పెన్స్ , థ్రిల్లర్ గా తీర్చిదిద్దడంలో సక్సెస్ అయ్యాడు.
చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. మంచి మార్కులు కొట్టేశాడు తను. అద్భుతమైన కథ, ఆకట్టుకునే సన్నివేశాలు, మనసుకు ఉల్లాస పరిచే సంగీతం, పాటలు ఇలా ప్రతిదీ థండేల్ ను బిగ్ సక్సెస్ అయ్యేలా చేశాయనడంలో సందేహం లేదు.