సౌత్ ఇండియాకు కేరాఫ్ గా మారిన కోలీవుడ్ లో ఇప్పుడు ఒకే ఒక్క చర్చ జరుగుతోంది. అదే సన్ పిక్చర్స్ నిర్మించిన సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ కీ రోల్ పోషించిన కూలీ చిత్రం. షూటింగ్ పూర్తయింది. విడుదలకు సిద్దంగా ఉంది. ఇప్పటికే మార్కెట్ ను షేక్ చేస్తోంది. దీనికి దర్శకుడు ఎవరో కాదు మోస్ట్ టాలెంటెడ్ , డైనమిక్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఇందులో రజనీకాంత్ తో పాటు అక్కినేని నాగార్జున, అమీర్ ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కూడా పాలు పంచుకున్నాడు. ఇక రోజుకో అప్ డేట్ తో దుమ్ము రేపుతున్నాడు దర్శకుడు. మరింత ఆసక్తిని పెంచేలా చేస్తున్నాడు.
తన ప్రాజెక్టు ఏది ప్రారంభించినా వెరీ స్పెషల్. జస్ట్ 60 రోజుల్లో సినిమాను పూర్తి చేయాలని అనుకుంటాడు. ఆ దిశగానే తను కష్టపడతాడు. తను మాస్టర్ తీశాడు దళపతి విజయ్ తో. మాళవిక మోహన్ ను కొత్తగా పరిచయం చేశాడు. ఆ తర్వాత తనే విజయ్ తో లియో తీశాడు. సింప్లీ సూపర్.
ఇప్పుడు స్టార్ హీరోతో మూవీ తీయడం మామూలు విషయం కాదు. తనకు కోలీవుడ్ లోనే కాదు యావత్ ప్రపంచంలోని పలు చోట్ల లెక్కించ లేనంత అభిమానులు ఉన్నారు. ఆయనంటే ప్రాణం ఇచ్చే వాళ్లు కూడా ఎక్కువే.
తను ఆ మధ్యన ఆస్పత్రికి వెళితే సామాజిక మాధ్యమాలన్నీ రజనీ కాంత్ గురించి చర్చలు, కామెంట్స్ తో నిండి పోయాయి. అంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఇటీవలే తను నటించిన జైలర్ దుమ్ము రేపింది. నిర్మాతకు మంచి డబ్బులు వచ్చాయి. ఇప్పుడు కూలీ గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఈసారి ఈ మూవీ రూ. 1000 కోట్లు కొల్లగొట్టడం ఖాయమని ప్రచారం తెగ నడుస్తోంది. సత్తా ఉన్న నటుడు..దమ్మున్న డైరెక్టర్ కావడంతో వచ్చినా ఆశ్చర్య పోవాల్సిన పని లేదంటున్నారు సినీ వర్గాలు.