సృజనాత్మకత కలిగిన దర్శకుడిగా పేరు పొందిన శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన తాజా చిత్రం కుబేర. ఇందులో అక్కినేని నాగార్జున, ధనుష్ తో పాటు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించారు. ప్రీ రిలీజ్ వేడుక ఘణంగా జరిగింది. ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కోలీవుడ్ స్టార్ హీరో. ఆయన అక్కినేని నాగ్ పై ప్రశంసలు కురిపించారు. ఆయన ఫిట్ నెస్ తో పాటు అందం కూడా అద్భుతమంటూ పేర్కొన్నాడు. అంతే కాదు ఆయన పట్ల తన సిస్టర్స్ ప్రేమను కలిగి ఉన్నారంటూ తెలిపాడు. దీంతో విస్తు పోయాడు స్టార్ హీరో . కుబేర ట్రైలర్ బాగా వచ్చిందన్నాడు. తాను దర్శకుడు శేఖర్ కమ్ముల నుంచి ఎంతో నేర్చుకున్నానని చెప్పాడు ధనుష్. సినిమాకు అందించిన సంగీతం బాగుందన్నాడు.
ఇదే సమయంలో నాగార్జునతో కలిసి పని చేయడం ఆనందంగా ఉందన్నాడు. మీ ఆకర్షణ కలకాలం ఉంటుందన్నాడు. ఆయన సినిమాలు చూస్తూ పెరిగామని, ఇప్పుడు తనతో కలిసి మూవీ చేస్తానని అనుకోలేదన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో. ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. కుబేరలో కింగ్ అనే ప్రత్యేక ట్రాక్ ను కంపోజ్ చేసినందుకు దేవిశ్రీ ప్రసాద్ ను అభినందించాడు.
రష్మిక మందన్నా నాగార్జున ఏజ్ పెరుగుతున్నా నిత్యంగా యవ్వనంగా ఉంటున్నారని, దీని వెనుక గల కారణం ఏమిటో చెబితే తమకు బాగుంటుందన్నారు. ఆ మ్యాజిక్ తనకు కూడా దొరికితే బాగుంటుందన్నారు. ఈ సందర్బంగా నాగార్జున మాట్లాడుతూ డైరెక్టర్ శేఖర్ కమ్ములను ఆకాశానికి ఎత్తేశాడు. తనతో ఎప్పటి నుంచో సినిమా చేయాలని అనుకుంటూ వచ్చానని, కానీ కుబేరతో ఆ కోరిక తీరిందన్నాడు. తను కథ చెప్పిన 20 నిమిషాల్లోనే తాను ఓకే చేశానని చెప్పాడు అక్కినేని నాగార్జున.