లండన్ – దక్షిణాఫ్రికా క్రికెట్ ఆటగాడు, స్టార్ పేసర్ కగిసో రబాడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లో లార్డ్స్ వేదికగా బలమైన ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది. ఈ గెలుపులో కగిసో రబాడా కీలకమైన పాత్ర పోషించాడు. తనతో పాటు సెంచరీతో ఆకట్టుకున్నాడు ఏడన్ మార్క్రారమ్, కెప్టెన్ టెంబా బావుమా. ఇద్దరూ కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తను సెంచరీతో దుమ్ము రేపితో టెంబా 66 కీలకమైన పరుగులు చేశారు. 282 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. టెస్టు ఫార్మాట్ లో విశ్వ విజేతలుగా నిలిచారు. భారీ ప్రైజ్ మనీ రూ. 30 కోట్లను కైవసం చేసుకున్నారు.
ఇక ప్రధానంగా చెప్పు కోవాల్సింది స్టార్ పేసర్ కగిసో రబాడా గురించే. తను ఈ కీలక పోరులో తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు కూల్చాడు. ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు. రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీశాడు. మొత్తంగా ఈ ఫైనల్ కీలక పోరులో తను ఒక్కడే 9 కీలకవైన వికెట్లను తీసి ఔరా అనిపించేలా చేశాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. తన జట్టుకు చిరస్మరణీయమైన విజయం అందించడంలో ముఖ్య భూమిక పోషించాడు కగిసో రబాడా. తను ఐపీఎల్ లో కూడా ఆడాడు.
ఇక కెరీర్ పరంగా చూస్తే కగిసో రబాడాకు 30 ఏళ్లు. తను ఇప్పటి వరకు 71 టెస్టులు ఆడాడు. మొత్తం 336 వికెట్లు పడగొట్టాడు. ఇది దక్షిణాఫ్రికా ఆల్ టైమ్ వికెట్లు తీసిన జాబితాలో తను నాల్గవ స్థానంలో నిలిచాడు. తన జట్టు విశ్వ విజేతగా నిలవడం పట్ల స్పందించాడు రబాడా. తన దేశం కోసం , జట్టు కోసం రక్తాన్ని ధార పోసేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించాడు. తను చేసిన తాజా కామెంట్స్ వైరల్ గా మారాయి.