కర్ణాటక – కేంద్ర దర్యాప్తు సంస్థ కోలుకోలేని షాక్ ఇచ్చింది కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు మాజీ ఎంపీ డీకే సురేష్ కు. ఇవాళ నోటీసులు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి విచారణ ఎదుర్కొంటోంది ఐశ్వర్య గౌడ్ అనే మహిళ. తనకు పలువురు ప్రముఖులతో సత్ సంబంధాలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసింది. ఆ డబ్బులు కోట్లల్లో ఉండడంతో తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. దీంతో తనను అదుపులోకి తీసుకుంది ఈడీ.
ఇదే సమయంలో విచారణలో భాగంగా ఐశ్వర్య గౌడ్ డీకే సురేష్ కూడా తనతో టచ్ లో ఉన్నాడంటూ బాంబు పేల్చింది. దీంతో తనకు నోటీసులు జారీ చేసింది ఈడీ. విచారణకు హాజరు కావాలంటూ నోటీసులలో స్పష్టం చేసింది.
దీనిపై సీరియస్ గా స్పందించారు డీకే సురేష్. తానే ఐశ్వర్య గౌడ్ పై ఫిర్యాదు చేశానని చెప్పారు. తన సోదరిని అంటూ చెప్పుకుంటూ తనను బద్నాం చేస్తోందంటూ పోలీసులకు తెలియ చేశానని తెలిపారు. ఈడీ నోటీసులు ఇవ్వడం పట్ల స్పందిస్తూ తాను తప్పకుండా విచారణకు హాజరవుతానని, ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశాడు మాజీ ఎంపీ.
ఇదిలా ఉండగా మాజీ ఎంపీ డీకే సురేష్ కు సమన్లు జారీ చేయడం కలకలం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం తన నివాసంలో నోటీసులు అందించింది. తనను గురువారం హాజరు కావాల్సిందిగా పేర్కొన్నారని, కానీ తనకు వేరే కార్యక్రమం ఉండడంతో సోమవారం వస్తానని తెలియ చేశానని చెప్పారు డీకే సురేష్.