అమరావతి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణలో తాను పార్టీ పెట్టిన సమయంలో తనను టార్గెట్ చేశారని వాపోయారు. ఇదే సమయంలో తాను ఏం చేస్తున్నాను..ఎవరెవరితో మాట్లాడుతున్నానని తన ఫోన్లను పనిగట్టుకుని ట్యాప్ చేశారంటూ ఆరోపించారు. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
గత బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చోటు చేసుకుంది. పది సంవత్సరాల పాటు రాచరిక పాలన సాగించారని, ప్రజలు తనకు బుద్ది చెప్పారు. ఫామ్ హౌస్ కే పరిమితం చేశారు. శాసన సభ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ కొట్టారు. రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ప్రజా ప్రభుత్వం కొలువు తీరాక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ ను ఏర్పాటు చేశారు సీఎం. ఈ మేరకు పలువురికి నోటీసులు జారీ చేశారు.
ఇందులో తప్పించుకుని అమెరికాలో తలదాచుకునే ప్రయత్నం చేసిన సీఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును హైదరాబాద్ కు రప్పించారు. లుక్ ఔట్ నోటీసులు జారీ చేయడం, చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో మనోడు దారికి వచ్చాడు. విచారణకు హాజరయ్యాడు. ఈ సందర్బంగా బాంబు పేల్చారు. తనకు ఎలాంటి ప్రమేయం లేదంటూనే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయమంటేనే తాను చేశానంటూ చెప్పారు. ఈ తరుణంలో వైఎస్ షర్మిలా రెడ్డి తాజాగా తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారంటూ వాపోవడంతో ఈ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది.