అమరావతి – కేంద్ర ప్రభుత్వం ఏపీకి వరాలు కురిపిస్తోంది. ఇందులో భాగంగా చంద్రబాబు అడిగిందే చాలు నిధులు మంజూరు చేస్తోంది. తాజాగా ఏపీకి తీపి కబురు చెప్పింది. ఉద్యోగుల నివాస భవనాల కోసం కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఏకంగా రూ. 2,787 కోట్లు ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లో ఆంధ్ర, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల నివాస భవనాల కోసం
కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ (CCS) ప్రాజెక్టు క్రింద కేంద్ర ప్రభుత్వం వీటిని మంజూరు చేసింది. . కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నివాస భవనాల కోసం రూ.1,329 కోట్లు, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవనం నిర్మాణానికి రూ.1,458 కోట్లు కేటాయించింది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థల పరిపాలన భవనాలు , అధికారుల నివాస సముదాయాలు అతి త్వరగా పూర్తి అయ్యి సేవలు అందించడానికి వీలు కుదురుతుంది.
త్వరలో 50 కి పైగా కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణం అమరావతిలో పూర్తి అయ్యి ప్రజలకు సేవలు అందించేందుకు వేగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు 20 సూత్రాల అమలు కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్.
ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో రాజధాని అమరావతి నిర్మాణం కోసం 2014- 19 మధ్య 2,500 కోట్ల గ్రాంట్, 2024 అనంతరం 15 వేల కోట్ల రూపాయల సహాయం, 11 వేల కోట్ల హడ్కో రుణం, 25 వేల కోట్ల ఓఆర్ఆర్, 3 వేల కోట్ల రైల్వే లైన్, స్మార్ట్ సిటీ మరియు హెరిటేజ్ సిటీ నిధులను సహాయం చేయడం జరిగింది.