ఊహించని రీతిలో శేఖర్ కమ్ముల తీసిన చిత్రం కుబేర ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది ఈ మూవీకి. ప్రపంచ వ్యాప్తంగా దీనిని శుక్రవారం రిలీజ్ చేశారు. ఇప్పటికే తను తీసిన సినిమాపై పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు దర్శకుడు. తను టాలీవుడ్ లో ప్రత్యేకమైన శైలి కలిగిన డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు. తన సినీ కెరీర్ లో ఇప్పటి వరకు తీసిన ప్రతి సినిమా దేనికదే ప్రత్యేకం. విచిత్రం ఏమిటంటే తొలిసారిగా స్టార్ హీరో, హీరోయిన్లతో కలిసి భారీ బడ్జెట్ తో మూవీ తీశాడు.
ఆయన అనుకున్నట్టే జరిగింది. ప్రేక్షకులు కుబేరకు బ్రహ్మరథం పడుతున్నారు. పూర్తి పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది ఈ చిత్రం. ఆశించిన దానికంటే ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉందంటున్నారు సినీ వర్గాలు. బిక్షగాడి పాత్రలో కోలీవుడ్ హీరో ధనుష్ పోషిస్తే అక్కినేని నాగార్జున ధనవంతుడి పాత్రలో లీనమయ్యారు. కుబేర అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రత్యేకించి టేకింగ్, మేకింగ్ లో తనకు తనే సాటి అనిపించుకున్న కమ్ముల అద్భుతంగా తెరకెక్కించాడు.
ఇక తొలిసారిగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కుబేర సినిమాకు సంగీతం అందించాడు. ఇక యాచకుడి పాత్ర చేసిన ధనుష్ అద్భుతంగా నటించాడంటూ పెద్ద ఎత్తున ప్రశంసలు కురుస్తున్నాయి. సిబిఐ అధికారిగా నాగార్జున కఠినంగా చిత్రీకరించిన తీరు కూడా మార్కులు పడుతున్నాయి. ఇక సినిమాకు ప్లస్ పాయింట్ గా మారింది రాక్ స్టార్ ఇచ్చిన మ్యూజిక్. ఒక రకంగా మ్యాజిక్ చేసిందని చెప్పక తప్పదు.