అమరావతి – మాజీ సీఎం జగన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు సీఎం చంద్రబాబు నాయుడు. తనకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతానంటే చూస్తూ ఊరుకుంటామా అని ప్రశ్నించారు. ఇక్కడ ఎవరూ చేతులు ముడుచుకుని కూర్చోలేదన్నారు. జనం అన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు. శుక్రవారం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. నరుకుతా, చంపుతా అంటూ పేట్రేగి పోతే తాట తీస్తామన్నారు. చిల్లర వేషాలు వేస్తూ, ప్రజలను, రాష్ట్రాన్ని భయాందోళనకు గురి చేస్తామంటే చర్యలు తప్పవని పేర్కొన్నారు.
నాయకులు అన్నాక హుందాతనం అనేది ఉండాలని, లేక పోతే జనం ఈసడించుకుంటారని గుర్తు పెట్టుకోవాలంటూ జగన్ రెడ్డిని ఉద్దేశించి సీరియస్ కామెంట్స్ చేశారు నారా చంద్రబాబు నాయుడు.
విచిత్రం ఏమిటంటే ఒకవైపు యోగా జరుగుతుంటే మరికొందరు రప్పా రప్పా అంటున్నారు.. ఒకప్పుడు ఊళ్లలో గ్రామ దేవతలకు పొట్టేళ్లను బలి ఇచ్చేటప్పుడు రప్పా రప్పా అనేవారు.. ఇష్టానుసారంగా టెర్రరిజం క్రియేట్ చేస్తే ఊరుకోమన్నారు
ఒకప్పుడు నేరస్తులతో దూరంగా ఉండేవాళ్లం.. ఇప్పుడు నేరస్తులతో కలిసి రాజకీయాలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు సీఎం. జగన్ రెడ్డి ముందు నుంచీ అరాచకవాదిగా ముద్ర పడ్డాడని, తనకు సీఎం పదవి వచ్చాక మరింత రెచ్చి పోయాడని ఆరోపించారు. కానీ తాను వచ్చాక అంత సీన్ లేదన్నారు. తనను ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ వచ్చానని చెప్పారు. తన ఆటలు నా ముందు సాగవని వార్నింగ్ ఇచ్చారు మాజీ సీఎంకు.