అందరి అంచనాలు తలకిందులు చేస్తూ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎప్పటి లాగే తను నిడివిని తగ్గించకుండానే విడుదల చేశారు. చూసే వారికి కొంత ఇబ్బంది కలిగించినా సినిమా మాత్రం అద్భుతం అని చెప్పక తప్పదు. దర్శకుడు తన సినీ కెరీర్ లో తొలిసారిగా స్టార్ హీరో, హీరోయిన్లతో మూవీ తీయడం. తన టేకింగ్, మేకింగ్ లో మరోసారి సత్తా చూపించాడు. దీనికి కథను సమకూర్చిన పింగళి చైతన్యను ప్రత్యేకంగా అభినందించి తీరాల్సిందే.
మొత్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. అంతే కాదు ఎల్లకాలం గుర్తుండి పోయేలా తన నటనతో మెస్మరైజ్ చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే కంటతడి పెట్టించేలా చేశాడు. ఇందుకు ధనుష్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. లేక పోతే అన్యాయం చేసిన వాళ్లం అవుతాం. ఒక యాచకుడికి మరో ధనవంతుడికి మధ్య జరిగిన ఆసక్తికరమైన పాయింట్ ను తీసుకుని కుబేర తెరకెక్కించాడు శేఖర్ కమ్ముల.
తను గతంలో తీసిన ప్రతి మూవీ దేనికదే ప్రత్యేకం. ఇక తన కెరీర్ లో కుబేర మాత్రం వెరీ వెరీ స్పెషల్ అని చెప్పక తప్పదు. ధనుష్ తో పాటు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, కింగ్ అక్కినేని నాగార్జున కీ రోల్స్ పోషించారు. కానీ ఈ ముగ్గురిలో కోలీవుడ్ స్టార్ కు మాత్రం ఎక్కువ మార్కులు పడతాయి. ఎందుకంటే అందులో జీవించాడు. మనల్ని మైమరిచి పోయేలా చేశాడు. నిజంగా తను యాచకుల వద్దకు వెళితే తను హీరోనని ఎవరూ గుర్తు పట్టనంతగా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.