టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హాట్ టాపిక్ గా మారాడు. తను ఏది మాట్లాడినా అది సంచలనంగా మారుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తను చేసిన వ్యాఖ్యలు. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నాతో డేటింగ్ లో ఉన్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఈ ఇద్దరు ఇటీవలే ఒకే కారులో ప్రయాణం చేస్తూ కెమెరాలకు చిక్కారు. దీంతో ఈ ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.
దీనిపై ఇటు దేవరకొండ కానీ అటు రష్మిక మందన్నా కానీ నోరు విప్పలేదు. అవునని లేక కాదనీ బయటకు చెప్పక పోవడంతో ఇద్దరూ ఫుల్ పీకల లోతు ప్రేమలో కూరుకు పోయినట్లు తేలి పోయింది. ఈ సందర్బంగా తాజాగా విజయ్ దేవరకొండ చిట్ చాట్ చేశాడు. ఈ సందర్బంగా తన మనసులోని మాట బయట పెట్టాడు. తనకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉందని, కానీ ఇప్పట్లో చెప్పలేమంటూ చావు కబురు చల్లగా చెప్పాడు.
జీవితంలో పెళ్లి అనేది మధురమైన సన్నివేశం. తనకు కూడా ఇంటివాడిని కావాలని ఉందని, పిల్లలతో ఆటాడు కోవాలనే కోరిక మరింత కలుగుతోందన్నాడు. కానీ తాను ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేక పోతున్నానని పేర్కొన్నాడు. ఇదే సమయంలో వివాహం గురించి తన పేరెంట్స్ ఎలాంటి ఒత్తిడి చేయడం లేదంటున్నాడు. ప్రస్తుతం తను నటించిన కింగ్ డమ్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇందులో బాలీవుడ్ ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే కీ రోల్ పోషిస్తోంది.