క‌దం తొక్కిన జైశ్వాల్..శుభ్ మ‌న్ గిల్

మూడు వికెట్ల‌కు 359 ప‌రుగులు

ఇంగ్లండ్ – ఇంగ్లండ్ టూర్ లో భాగంగా తొలి టెస్టులో దుమ్ము రేపారు యువ ఆట‌గాళ్లు. ఇంగ్లండ్ జ‌ట్టుకు చుక్క‌లు చూపించారు. కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ తో పాటు యంగ్ స్టార్ య‌శ‌స్వి జైశ్వాల్ సూప‌ర్ షోతో ఆక‌ట్టుకున్నారు. ప్ర‌త్య‌ర్థుల బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు. ఇద్ద‌రూ శతకాల మోత మోగించారు. తొలి రోజు తొలి ఇన్నింగ్స్ లో కేవ‌లం 3 వికెట్లు కోల్పోయి 359 ర‌న్స్ చేశారు. మొద‌టిసారి టెస్టు జ‌ట్టుకు స్కిప్ప‌ర్ గా ఎంపికైన శుభ్ మ‌న్ గిల్ సూప‌ర్ గా ఆడాడు.

త‌ను 127 ర‌న్స్ చేశాడు. 175 బంతులు ఎదుర్కొని 16 ఫోర్లు ఒక సిక్స్ కొట్టాడు. య‌శ‌స్వి జైశ్వాల్ 101 ర‌న్స్ చేశాడు. 159 బంతులు ఎదుర్కొని 16 ఫోర్లు ఒక సిక్స్ తో రెచ్చి పోయాడు.

వైస్ కెప్టెన్ రిష‌బ్ పంత్ హాఫ్ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. త‌ను 65 ర‌న్స్ చేశాడు. కేఎల్ రాహుల్ 45 ర‌న్స్ తో రాణించాడు. ఇక టెస్టులో తొలిసారిగా ఎంట్రీ ఇచ్చిన సాయి సుద‌ర్శ‌న్ సున్నాకే వెనుదిరిగి నిరాశ ప‌రిచాడు. ఇంగ్లండ్ స్కిప్ప‌ర్ ఎంత మంది బౌల‌ర్ల‌ను మార్చినా భార‌త ఆట‌గాళ్ల‌పై ప్ర‌భావం చూప‌లేక పోయారు. బౌల‌ర్ల‌లో బెన్ స్టోక్ 2 వికెట్లు తీయ‌గా కార్స్ ఒక వికెట్ తీశాడు. మొత్తంగా తొలి రోజు మాత్రం భార‌త జ‌ట్టుదేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. గిల్ , జైశ్వాల్ తొలి వికెట్ కు భారీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. ఇక రిష‌బ్ పంత్ గిల్ తో క‌లిసి నాలుగో వికెట్ కు 138 ప‌రుగుల పార్ట‌న‌ర్ షిప్ చేశారు. మొత్తంగా భార‌త్ త‌న ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తుండ‌డం విశేషం. ఇది గిల్ కు ప్ల‌స్ పాయింట్ గా మారింది.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com