యోగాంధ్ర సెన్సేష‌న్ గిన్నిస్ రికార్డ్

3 ల‌క్ష‌ల మందికి పైగా భారీ యోగా ర్యాలీ

విశాఖ‌పట్నం – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిధిగా పాల్గొన్న విశాఖ అంతర్జాతీయ యోగా దినోత్సవం గిన్నిస్ రికార్డ్ సృష్టించింది. మూడు లక్షల మందికిపైగా ప్రధాని మోదీతో కలిసి యోగా చేశారు.సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారాలోకేశ్ సహా మంత్రులు,కేంద్ర మంత్రులు,అధికారులు అంతా పాల్గొన్నారు. విశాఖ నుంచి బోగాపురం వరకూ ఏర్పాటు చేసిన వేదిక నూత‌న చ‌రిత్ర‌కు నాంది ప‌లికింది. ఇదిలా ఉండ‌గా గతంలో సూరత్‌లో నమోదైన యోగా కార్యక్రమం రికార్డు బ్రేక్ అయింది.

11వ యోగా దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించింది ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం. దీనిని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఏ ఒక్క‌రికీ ఇబ్బంది లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టారు. పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల న‌లుమూలల నుంచి త‌ర‌లి వ‌చ్చారు యోగా డేను బిగ్ స‌క్సెస్ చేశారు. యావ‌త్ ప్ర‌పంచం మొత్తం ఈ కార్య‌క్ర‌మాన్ని చూసింది. రాష్ట్ర‌, జాతీయ‌, అంత‌ర్జాతీయ మీడియా సంస్థ‌ల‌న్నీ యోగా డేపై ఫోక‌స్ సారించాయి.

త‌మ పాల‌నా ద‌క్ష‌త‌కు యోగా డే విజ‌యం ఓ నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు ఈ సంద‌ర్బంగా సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. యోగా అన్న‌ది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో భాగం కావాల‌ని పిలుపునిచ్చారు. యోగా ప్ర‌పంచాన్ని ఏకం చేసింద‌న్నారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. జీవితంలో ఒత్తిళ్ల నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఇది దోహ‌దంగా ప‌ని చేస్తుంద‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com