బ్రాడ్ మ‌న్ రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన జైశ్వాల్

పానీపూరి కుర్రాడు క్రికెట్ లో సంచ‌ల‌నం

యంగ్ క్రికెట‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ సంచ‌ల‌నం సృష్టించాడు. త‌న జోరుకు దిగ్గ‌జ బ్యాట‌ర్ బ్రాడ్ మ‌న్ రికార్డు ను బ‌ద్ద‌లు కొట్టాడు. ఇంగ్లండ్ లో ఇంగ్లండ్ తో జ‌రుగుతున్న తొలి టెస్టులో సూప‌ర్ షో చేశాడు. కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ తో పాటు జైశ్వాల్ భారీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. ఇద్ద‌రూ క‌లిసి సెంచ‌రీల‌తో క‌దం తొక్కారు. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు చుక్క‌లు చూపించారు. భారీ స్కోర్ న‌మోదు చేశారు. ఒక ర‌కంగా చెప్పాలంటే ఈ యంగ్ క్రికెట‌ర్లు ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగారు.

ఇక త‌న కెరీర్ లో అతి పిన్న వ‌య‌సులోనే టెస్టు జ‌ట్టుకు నాయ‌కత్వ బాధ్య‌త‌లు చేప‌ట్టాడు శుభ్ మ‌న్ గిల్. త‌ను కూడా సెంచరీతో క‌దం తొక్కాడు. జైశ్వాల్ 16 ఫోర్లు ఓ భారీ సిక్స్ తో అద్భుత‌మైన శ‌త‌కం సాధించాడు. మ‌రో వైపు జ‌ట్టు వైస్ కెప్టెన్ రిష‌బ్ పంత్ మ‌హేంద్ర సింగ్ ధోనీ పేరుతో న‌మోదైన రికార్డ్ ను బ్రేక్ చేశాడు. గ‌తంలో భార‌త జ‌ట్టు మాజీ స్కిప్ప‌ర్ మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ ఇంగ్లండ్ పై భారీ స్కోర్ సాధించాడు.

కాగా య‌శ‌స్వి జైశ్వాల్ ఇదే జ‌ట్టుపై విశాఖ‌లో జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో డ‌బుల్ సెంచ‌రీ బాదాడు. ఆ త‌ర్వాత ఇంగ్లండ్ పై సెంచ‌రీ న‌మోదు చేయ‌డం విశేషం. ద‌క్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ , ఆస్ట్రేలియాపై అత్య‌ధిక స‌గ‌టుతో మ‌హీ చేసిన రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు పంత్. ఈ మ్యాచ్ లో పూర్తి ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది టీమిండియా.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com