హైదరాబాద్ -కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసులపై సీబీఐ దర్యాప్తు జరగాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేసీఆర్ కుటుంబం అవినీతి మీద విచారణ జరపడానికి కేంద్రం సిద్ధంగా ఉందని, ఇక వాళ్లు జైలుకు వెళ్లడం ఖాయమని జోష్యం చెప్పారు. బీఆర్ఎస్ నేతలకు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం అని గతంలో రాహుల్ గాంధీ ఆరోపించారని అన్నారు. ఇంత జరుగుతున్నా వారిపై ఎందుకు సర్కార్ చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేబినెట్, సబ్ కమిటీ నివేదికలను ఎందుకు బయట పెట్టడం లేదంటూ నిలదీశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని ధ్వజమెత్తారు మండి సంజయ్ కుమార్ పటేల్. గతంలో 10 ఏళ్ల పాటు రాచరిక పాలన సాగించారని ఆరోపించారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, వేల కోట్లు అక్రమంగా సంపాదించుకున్నారని మండిపడ్డారు. రాజీవ్ గాంధీ చేసిన ఆరోపణలపై ఎందుకు నోరు మెదపడం లేదంటూ నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డిపై. అధికారంలో ఉన్నది మీరేనని మరి ఇప్పుడు చర్యలు తీసుకునేందుకు ఎవరు అడ్డు పడుతున్నారో చెప్పాలన్నారు.
ఇవాళ ఏరికోరి మీకు ప్రజలు అధికారాన్ని కట్టబెడితే కల్వకుంట్ల కుటుంబంపై విచారణ జరపకుండా కావాలని కాలయాపన ఎందుకు చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు బండి సంజయ్ కుమార్ పటేల్.