అమెరికా – ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్దం చోటు చేసుకున్న తరుణంలో అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఆదివారం ప్రపంచ మీడియాతో మాట్లాడారు.ఇరాన్లోని ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్లోని అణు స్థావరాలపై అమెరికా విజయవంతంగా దాడి చేసిందని ప్రకటించారు. ఆరు B-2 స్టెల్త్ బాంబర్లు ఫోర్డోపై బంకర్-బంకింగ్ GBU-57 బాంబులను జార విడిచగా, 30 టోమాహాక్ క్షిపణులు నటాంజ్, ఇస్ఫహాన్లను లక్ష్యంగా చేసుకున్నాయన్నారు డొనాల్డ్ ట్రంప్.
అధ్యక్షుడు ట్రంప్ దీనిని చారిత్రాత్మక దాడిగా అభివర్ణించారు దేశాధ్యక్షుడు. ఇకనైనా ఇరాన్ తన తప్పు తెలుసుకోవాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎంత త్వరగా తన తప్పు తెలుసుకుని దారికి రావాలని లేకపోతే పుట్టగతులు ఉండవని పేర్కొన్నారు. ఇరాన్ US మిలిటరీ న్యూక్లియర్ సైట్లను పూర్తిగా ధ్వంసం చేస్తామన్నారు.
యుఎస్ B-2 బాంబర్లు ఫోర్డోపై 30,000 పౌండ్ల GBU-57 మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ బాంబులతో దాడి చేశాయని ప్రకటించారు, ఇందులో ఆరు బాంబర్లు పాల్గొన్నాయని చెప్పారు. నటాంజ్, ఇస్పహాన్ అణ్వాయుధ స్థావరాలపై 30 టోమాహాక్ క్షిపణులు దాడి చేశాయని వెల్లడించారు. ఈనెల 21, 22న పూర్తిగా దాడులకు తెగబడ్డామని ప్రకటించారు. ఇదిలా ఉండగా మరో వైపు కీలక ప్రకటన చేశారు ట్రంప్. తను నిర్వహిస్తున్న ట్రూప్ సోషల్ సామాజిక వేదికగా వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.