విజయవాడ – ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. తన సోదరుడు జగన్ రెడ్డిని ఏకి పారేశారు. రెడ్డి వాహనం కింద పడి సింగయ్య నలిగి పోయిన దృశ్యాలు అత్యంత భయానకరంగా ఉన్నాయని వాపోయారు. ఇంత జరిగినా సోయి లేకుండా అలాగే కాన్వాయ్ పోనివ్వడం తనను కంటతడి పెట్టించేలా చేసిందన్నారు. కారు కింద ఒక వ్యక్తి పడ్డారన్న సోయి లేకుండా కాన్వాయ్ కొనసాగడం ఏంటి అంటూ నిలదీశారు. 100 మందికి పర్మిషన్ ఇస్తే వేల మంది ముందు సైడ్ బోర్డు మీద నిలబడి అభివాదం చేస్తే ఎలా అని ఫైర్ అయ్యారు.
విజయవాడలో వైఎస్ షర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాన్వాయ్ సందర్బంగా చేతులు ఊపుకుంటూ ప్రజలను రెచ్చగొట్టడం పట్ల ఫైర్ అయ్యారు. ప్రజల ప్రాణాలు తీసే హక్కు మీకు ఎవరిచ్చారంటూ నిలదీశారు ఏపీపీసీసీ చీఫ్. బెట్టింగ్ లో ఓడిపోయి సూసైడ్ చేసుకున్న వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకు ఇద్దరిని బలి ఇస్తారా అని అన్నారు. ఇదేం రాజకీయం ? ఇదెక్కడి రాక్షస ఆనందం అంటూ నిప్పులు చెరిగారు.
మీ ఉనికి కోసం జనాలను టైర్ల కింద తొక్కుకుంటూ పోతారా ? ప్రజల ప్రాణాల మీద శవ రాజకీయాలు చేస్తారా ? కార్ సైడ్ బోర్డ్ మీద నిలబడి ఒక నాయకుడిగా కాన్వాయ్ మూవ్ చేయించడం సబబేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా జగన్ బాధ్యత రాహిత్యానికి అద్దం పడుతుందన్నారు. బలప్రదర్శన చేసి సింగయ్య మృతికి కారణమైన తనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి.