తను నేషనల్ క్రష్ కాదు ఇంటర్నేషనల్ క్రష్ అంటూ ప్రశంసలు కురిపించారు మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ నటి రష్మిక మందన్నాపై. తను కీ రోల్ పోషించింది శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర చిత్రంలో. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొంచెం నిడివి ఎక్కువగా ఉన్నప్పటికీ జనం ఆదరిస్తున్నారు. ప్రేక్షకులు సక్సెస్ చేశారు. మంచి పాజిటివ్ టాక్ రావడంతో మెల మెల్లగా కాసులు వస్తున్నాయి. ఇప్పటికే భారీ ఎత్తున వసూలు చేసినట్లు టాక్. ఇది ఇలా ఉండగా ఊహించని రీతిలో కుబేర సక్సెస్ కావడంతో ఫుల్ జోష్ లో ఉంది చిత్ర బృందం.
ఇదిలా ఉండగా మరో కీలక పాత్రలు పోషించారు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, కింగ్ అక్కినేని నాగార్జున. వీరిలో ఎక్కువ మార్కులు ధనుష్ కు పడ్డాయి. దీనికి కారణం తను యాచకుడి పాత్రలో జీవించాడు. అందులో లీనమై పోయాడు. ఎవరైనా నిజంగా భిక్షగాడా అన్నట్లుగా మెస్మరైజ్ చేశాడు .కుబేర బిగ్ సక్సెస్ కావడంతో సక్సెస్ మీట్ నిర్వహించారు హైదరాబాద్ లో.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవి. తను రష్మిక మందన్నాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తన కళ్లు మరింతగా ఆకట్టుకున్నాయని, ఆ కళ్లలోనే అన్నీ చెప్పేస్తోందంటూ కితాబు ఇచ్చారు. అంతే కాకుండా ఇంకో హీరో అయితే యాచకుడి పాత్ర చేసేందుకు ఒప్పుకోరని, కానీ ధనుష్ అందుకు ఒప్పుకోవడం, మంచి పేరు తెచ్చుకోవడం పట్ల ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమా సక్సెస్ కుబేర టీంది కాదని ఇది తన స్వంత మూవీ విజయవంతం అయినట్లుగా తనకు అనిపిస్తోందని పేర్కొన్నారు.
ప్రతి హీరో, హీరోయిన్లకు చాలా అరుదుగా ఇలాంటి పాత్రలు వస్తుంటాయన్నారు. కానీ ఒక్కోసారి అనుకోకుండా వచ్చే పాత్రలే మనల్ని మరిచి పోలేకుండా చేస్తాయన్నారు. ఈ సందర్బంగా ప్రతి ఒక్కరినీ పేరు పేరునా అభినందించారు.