కింగ్ అక్కినేని నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను నటించిన కుబేర మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల వారు ఆదరిస్తున్నారు. అక్కున చేర్చుకుంటున్నారు. ఓ యాచకుడు, ఓ ధనవంతుడి మధ్య జరిగే కథనే సినిమాగా తీశాడు శేఖర్ కమ్ముల. తను గతంలో చిన్న స్టార్స్ తో మూవీస్ తీస్తే. ఈసారి భారీ తారాగణంతో చిత్రం తీయడం విచిత్రం. ఇందులో ధనుష్ , రష్మిక మందన్నాతో పాటు నాగార్జున నటించడం విశేషం.
ప్రధానంగా భిక్షగాడి పాత్రకు పూర్తి న్యాయం చేశాడు యాక్టర్ ధనుష్. కుబేర మూవీకి కథ రాసింది ప్రముఖ రచయిత్రి పింగళి చైతన్య. ఈ సందర్బంగా మూవీ కోసం ఇచ్చిన సంగీతం సూపర్ . మొదటిసారిగా దేవిశ్రీ ప్రసాద్ శేఖర్ కమ్ముల కోసం పని చేశాడు. కుబేర మూవీ సక్సెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన రష్మిక మందన్నా లాంటి నేషనల్ క్రష్ ఇలాంటి పాత్రకు ఒప్పుకోవడం పట్ల అభినందించారు. ఆయన ధనుష్ ను ఆకాశానికి ఎత్తేశాడు. ఇదే సమయంలో నాగ్ నటన సూపర్ గా ఉందంటూ కితాబు ఇచ్చాడు.
మరో వైపు నటించిన నాగ్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా సహ నటి రష్మిక మందన్నాను ఉద్దేశించి కామెంట్స్వ చేశాడు. తనలో తనకు దివంగత నటి శ్రీదేవి కనిపిస్తోందన్నాడు. దీంతో హాజరైన వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆమెలో అద్భుతమైన టాలెంట్ దాగి ఉందన్నాడు. ఇలాంటి నటిని తాను ఇంత వరకు చూడలేదని చెప్పాడు. మొత్తం మీద తను చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.