ఏపీలో ఎన్డీఎంఏ జాతీయ బృందం ప‌ర్య‌ట‌న

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ

అమ‌రావ‌తి – కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఆదేశానుసారం అన్ని రాష్ట్రాల్లో ఎంపిక చేసిన జిల్లాల్లో విపత్తు నిర్వహణ సన్నద్ధతను పరిశీలించేందుకు మూడు రోజుల పర్యటనలో భాగంగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఎ) జాయింట్ అడ్వైసర్ నావల్ ప్రకాష్, అండర్ సెక్రటరీ అభిషేక్ బిస్వాస్, సీనియర్ కన్సల్టెంట్ అభినవ్ వాలియ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని సోమవారం సందర్శించారు.

స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్లో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అమలు చేసే ప్రణాళికలు , నైరుతి ఋతు పవనాల సీజన్ సంసిద్ధత, ముందస్తు హెచ్చరికల వ్యవస్థ పనితీరు, కమ్యూనికేషన్ పరికరాల గురించి బృందానికి ఈడి వెంకట దీపక్ వివరించారు. ఈ బృందం ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో ప‌ర్య‌టించింది. మంగ‌ళ‌వారం ఇదే బృందం తూర్పుగోదావరి, అనకాపల్లి, ఎల్లుండి విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు.

ఈ పర్యటనలో బృందం జిల్లా కలెక్టర్లు, లైన్ డిపార్టమెంట్ల అధికారులతో సమావేశమై విపత్తు నిర్వహణ ఎస్వోపి, జిల్లా ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ పనితీరు, విపత్తు ప్రమాద తగ్గింపును విధి విధానాలు బలోపేతం చేయడానికి, భవిష్యత్ విపత్తుల సన్నద్ధతపై జిల్లా యంత్రాంగం చేపట్టే చర్యలపై మీద సమీక్షించనున్నారు. సమర్ధవంతంగా విపత్తులను ఎదుర్కొనేందుకు జిల్లా అధికారులకు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com