తిరుపతి జిల్లా – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. తన సోదరుడు, మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. తన పర్యటనలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన సింగయ్య గురించి స్పందించారు. తన మృతి జగన్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగా జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా పోలీసులు జగన్ డ్రైవర్ రమణారెడ్డిని ఏ1గా , ఏ2గా జగన్ రెడ్డిపై కేసు నమోదు చేశారన్నారు. క్షమాపణలు చెప్పాల్సింది పోయి ఫేక్ వీడియో షేర్ చేశారంటూ అబద్దాలు మాట్లాడటం దారుణమన్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయొద్దంటూ సోదరుడికి హితవు పలికారు.
జగన్ కి మానవత్వమే లేదని, ఉంటే సింగయ్య కుటుంబాన్ని ఎందుకు పరామర్శించే వాడని అన్నారు షర్మిల. ఒకవేళ రూ. 5 కోట్లు లేదా రూ. 10 కోట్లు ఇచ్చి క్షమించమని అడగాల్సి ఉండేదన్నారు. 5 ఏళ్ల పాటు కుంబకర్ణుడి లాగా మొద్దు నిద్ర పోయి, తీరా కూటమి దెబ్బకు ఇప్పుడు ప్రజా సమస్యలంటూ బయటకు వచ్చాడని ఎద్దేవా చేశారు. జగన్ వి బలప్రదర్శన, జన సమీకరణ కార్యక్రమాలు తప్పా ప్రజల కోసం కానే కాదన్నారు. నాకు డబ్బుంది, బలం ఉంది అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు షర్మిల.
కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని, జగన్ జన సమీకరణ సభలకు అనుమతి ఇవ్వకండి. .జనాలను చంపకండని అన్నారు. కారులో ఉన్న అందరినీ విచారణకు పిలవాలని డిమాండ్ చేశారు. జగన్ కారు కిందపడే సింగయ్య చని పోయాడని వాపోయారు షర్మిల. ఇది స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఒక మనిషి పడ్డాడని కనీస స్పృహ లేకుండా పోయిందన్నారు. జగన్ టూర్ కు 5 వాహనాలకే పర్మిషన్ ఇస్తే 50 వాహనాలతో బల ప్రదర్శన చేశాడని ధ్వజమెత్తారు.