టాలీవుడ్ లో మోస్ట్ పవర్ ఫుల్ హీరోగా గుర్తింపు పొందిన మంచు మోహన్ బాబు నిర్మాణ సారథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం కన్నప్పపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనిని ఏకంగా రూ. 200 కోట్లకు పైగా భారీ ఖర్చుతో తెరకెక్కించారు. ఇండియా సినిమాలో టాప్ హీరో, హీరోయిన్లు కన్నప్పలో భాగం పంచుకున్నారు. ముఖ్య పాత్రలు పోషించారు. ఇది పూర్తిగా భారతీయ ఇతిహాసానికి సంబంధించిన కథ. దీనిని అద్భుతంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.
ఇక సినిమాకు సంబంధించిన పోస్టర్స్ , టీజర్, సాంగ్స్ కు మంచి ఆదరణ లభించింది. దీంతో దూకుడు పెంచారు మంచు విష్ణు. అన్నీ తానై సినిమా ప్రచార బాధ్యతలను పంచుకున్నాడు. ఇప్పటికే అమెరికాలో పర్యటించాడు. సినిమా ప్రమోషన్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. వాసరా ఎంటర్టైన్మెంట్ ద్వారా విష్ణు మంచు కన్నప్ప యుఎస్ఏలో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా కన్నప్పను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మంచు మోహన్ బాబు. హైదరాబాద్ లో గ్రాండ్ ఈవెంట్ జరిగింది.
ఈకార్యక్రమానికి ప్రముఖ నటుడు బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాక్షాత్తు ఆ పరమ శివుడి అనుగ్రహం వల్లనే మంచు మోహన్ బాబు కన్నప్పను తీశాడని కొనియాడారు. తామిద్దరం కలిసి ఎన్నో సినిమాలలో నటించామని అన్నారు. ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించిన కన్నప్ప మూవీ ముందుగా యుఎస్ లో జూన్ 26న గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రీమియర్ షోస్ ప్రదర్శిస్తారు. ఉత్తర అమెరికాలోని ప్రధాన నగరాలలో గ్రాండ్ ప్రీమియర్లను ప్లాన్ చేస్తున్నారు. బుకింగ్స్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. టికెట్లు వేగంగా అమ్ముడు పోతున్నాయి.