మాటల మాంత్రికుడు, దిగ్గజ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. బన్నీతో అల వైకుంఠ పురంలో బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రంలో తొలుత లవ్లీ బ్యూటీ పూజా హెగ్డేను అనుకున్నారు. ఆ తర్వాత ఆమెను సైడ్ చేశారు. పూజా స్థానంలో లవ్లీ గర్ల్ శ్రీలీల ఎంటర్ అయింది. ఆమెతో పాటు మరో నటిని కూడా ఎంపిక చేశారు. ప్రస్తుతం సినిమా వస్తుందా రాదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
అయితే ఇటీవల మహేష్ బాబు కీలక ప్రకటన చేశాడు. గుంటూరు కారం చిత్రం పక్కా సంక్రాంతికి రావడం అని తెలిపాడు. ఆరోజు ఫ్యాన్స్ కు అసలైన పండుగ ఉండబోతోందంటూ తాజాగా నిర్మాత నాగవంశీ అన్నాడు.
భారీ ధరకు నైజాం హక్కులు ఇచ్చామని చెప్పాడు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నాడు. గతంలో నటించిన సినిమాలకు భిన్నంగా మహేష్ బాబు పాత్ర ఉంటుందన్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సిసలైన మార్క్ ఏమిటో ఈ చిత్రం ప్రేక్షకులకు చూపిస్తుందన్నాడు నాగవంశీ.