హిందీ చలన చిత్ర పరిశ్రమలో ప్రత్యేకత కలిగిన నటుడు అమీర్ ఖాన్. తన రూట్ వేరు. తన జానర్ వేరు. స్టార్టింగ్ లో అందాల తార మాధురీ దీక్షితో తీసిన దిల్ సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత చాలా సినిమాలలో నటించాడు. కానీ ఎక్కడా తనకు నచ్చని పాత్రలను ఒప్పుకోలేదు. తనకు కథ నచ్చాలి. అందులో తన పాత్ర ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదని నిర్ణయం తీసుకున్నాడు. ఇందుకు సంబంధించి ఎక్కువగా రీమేక్స్ పై ఆధారపడుతూ వచ్చాడు. తాజాగా జెనీలియాతో కలిసి నటించిన సితారే జమీన్ పర్ ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా ఈ చిత్రంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇది ఛాంపియన్స్ కు పక్కా మక్కీకి మక్కీ దించేశారంటూ సోషల్ మీడియాలో సినీ ప్రేమికులు పేర్కొంటున్నారు. దీనిపై తీవ్రంగా స్పందించాడు అమీర్ ఖాన్. తాను ఏది ఒరిజనల్ , ఏది రీమేక్ అని పట్టించుకోనని చెప్పాడు. తమిళ సినీ పరిశ్రమకు చెందిన స్టార్ డైరెక్టర్ కేఆర్ మురుగదాస్ తో గజిని తీశాడు. అది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇండియాలో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. తను సల్మాన్ ఖాన్ తో తీసిన సికిందర్ ఆశించిన మేర ఆడలేదు.
అయినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు అమీర్ ఖాన్. తన సహచర నటుడుతో కలిసి దర్శకుడితో పిచ్చా పాటి మాట్లాడాడు. తాజాగా తనపై ట్రోల్స్ , విమర్శలకు ధీటుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు. అవును రీమేక్ మూవీస్ తీస్తే తప్పేంటి అంటూ ప్రశ్నించాడు. ఇందులో అభ్యంతరం పెట్టాల్సిన అవసరం ఏముందన్నాడు. కథ నచ్చింది. దానికి ఓకే చెప్పా. తాను రీమేక్ మూవీస్ పై ఎక్కువగా ఫోకస్ పెడతానని, అవి సక్సెస్ అవుతాయని తనకు నమ్మకం ఉందన్నాడు. తాజాగా తను చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తాజాగా తను కోలీవుడ్ కు చెందిన ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో కలిసి సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు.