హైదరాబద్ – తెలంగాణ అవినీతి నిరోధక శాఖ కీలక ప్రకటన చేసింది. నీటి పారుదల శాఖలో ఈఈగా పని చేస్తున్న నూనె శ్రీధర్ పై లెక్కకు మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో ఏసీబీ రంగంలోకి దిగింది. మొత్తం 13 ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఈ మేరకు కీలక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. శ్రీధర్ నివాసంతో పాటు బంధువుల ఇళ్లల్లోనూ ఏసీబీ సోదాలు చేపట్టారు. సోదాల్లో భారీగా ఆస్తులు గుర్తించామని తెలిపింది. తెల్లాపూర్ లో విల్లా, షేక్ పేట ప్లాట్, కరీంనగర్ లో మూడు ఓపెన్ ప్లాట్లు, అమీర్ పేటలో వాణిజ్య భవనం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లో మూడు ఇండిపెండెంట్ హౌస్ లు, 16 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తించినట్లు తెలిపింది ఏసీబీ.
అంతే కాకుండా రెండు ఖరీదైన కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకులో భారీగా నగదు నిల్వ ఉన్నట్లు గుర్తించినట్లు స్పష్టం చేసింది. బహిరంగ మార్కెట్లో వందల కోట్ల విలువైన ఆస్తులు ఉంటాయని అంచనా వేసింది. శ్రీధర్ తన పదవిని అడ్డం పెట్టుకొని భారీగా అక్రమాస్తులు కూడ పెట్టినట్టు గుర్తించింది. ఈ సందర్బంగా అక్రమంగా ఆస్తులు సంపాదించినట్లు సోదాలలో తేలడంతో వెంటనే తనను అదుపులోకి తీసుకుంది. ఆ వెంటనే నాంపల్లి కోర్టులో హాజరు పర్చింది. తనకు రిమాండ్ విధించారు జడ్జి. ఇతిలా ఉండగా ఏసీబీ దాడుల్లో బయట పడిన ఆస్తుల వివరాలు వెల్లడించడంతో అందరూ విస్తు పోయారు. అంతే కాకుండా బహిరంగ మార్కెట్ లో వీటి విలువ దాదాపు రూ. 150 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేసింది అవినీతి నిరోధక శాఖ.