మాజీ భార్య మోసం చేసింది – హీరో

సంచ‌ల‌న లేఖ విడుద‌ల చేసిన జ‌యం ర‌వి

చెన్నై – ప్ర‌ముఖ త‌మిళ సినీ హీరో జ‌యం ర‌వి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. గురువారం లేఖ విడుద‌ల చేశాడు. త‌న మాజీ భార్య ఆర్తి పై నిప్పులు చెరిగాడు. త‌న‌ను నిట్ట నిలువునా మోసం చేసింద‌ని వాపోయాడు.. త‌న ఆడంబరాల కోసం త‌న‌ను వాడుకుని వ‌దిలేసిందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. త‌న‌ను షూరిటీగా పెట్టి కోట్లాది రూపాయ‌లు అప్పులు చేసింద‌ని, త‌న‌ను రోడ్డు పాలు చేసిందంటూ ఫైర్ అయ్యాడు. త‌న‌ను న‌మ్మి పూర్తిగా అభాసు పాల‌య్యాన‌ని, చివ‌ర‌కు అస‌లైన క్యారెక్ట‌ర్ కోల్పోయే ప‌రిస్థితి దాపురించింద‌న్నాడు.

ఈ త‌రుణంలో త‌ను విడాకుల కోసం ప్ర‌య‌త్నం చేశాన‌ని చెప్పాడు. ఇందులో త‌ప్పు ఏముందంటూ ప్ర‌శ్నించాడు. ఇదిలా ఉండ‌గా త‌న‌పై లేఖ విడుద‌ల చేయ‌డం ప‌ట్ల మాజీ భార్య సీరియ‌స్ గా స్పందించింది. త‌ను ప‌చ్చి మోస‌గాడంటూ ఆరోపించింది. విడాకులు తీసుకునేంత వ‌ర‌కు త‌న‌ను మాజీ భార్య అని పిల‌వ‌ద్ద‌ని కోరింది. అయితే జ‌యం ర‌వి గ‌త కొంత కాలం నుంచి ప్ర‌ముఖ సింగ‌ర్ కెనీషాతో స‌న్నిహితంగా ఉండ‌డం, ఈవెంట్స్ కు హాజ‌రు కావ‌డం సంచ‌ల‌నం క‌లిగించింది. వారిద్ద‌రూ రిలేషష‌న్ షిప్ లో ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది.

జ‌యం ర‌వితో త‌మ బంధం బాగానే సాగింద‌ని, ఇది కొన్నేళ్లుగా కొన‌సాగింద‌ని తెలిపింది. అయితే ఎప్పుడైతే క‌నీషా జ‌త అయ్యిందో ఆనాటి నుంచి త‌మ ప‌చ్చ‌టి కాపురంలో చిచ్చు మొద‌లైంద‌ని వాపోయింది. ఒక ఏడాది పాటు తాను న‌ర‌కాన్ని అనుభ‌వించాన‌ని క‌న్నీటి ప‌ర్యంత‌మైంది. 10 , 14 ఏళ్ల వ‌య‌సు క‌లిగిన త‌న ఇద్ద‌రు కుమారులను కాపాడుకునేందుకు ఇంత‌కాలం ప్ర‌య‌త్నం చేశాన‌ని తెలిపింది .

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com