చెన్నై – డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన తమిళ సినీ నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను డ్రగ్స్ అమ్మ లేదని, తెలియక డ్రగ్స్ తీసుకున్నానని వాపోయాడు. నిన్న తనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన బిడ్డ అనారోగ్యంతో ఉన్నాడని, తనకు వెంటనే బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు. అరెస్ట్ చేసిన తనను కోర్టులో హాజరు పర్చగా జూలై 7 వరకు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది.
ఇదిలా ఉండగా కోలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. ఇప్పటికే పలువురిపై కన్నేసి ఉంచినట్లు సమాచారం. ఇలా బహిరంగంగా నటుడు పట్టుబడడం ఒకింత విస్తు పోయేలా చేసింది. ఇక ముంబైలో ఇది సర్వ సాధారణంగా మారి పోయింది. మరో వైపు టాలీవుడ్ లో సైతం ఈ డ్రగ్స్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆ మధ్యన వీరిపై కేసులు నమోదు కూడా చేశారు. విచారణకు సైతం పిలిచారు. వీరిలో దర్శకుడు పూరీ జగన్నాథ్ , రవితేజ, దగ్గుబాటి రానా, రకుల్ ప్రీత్ సింగ్, తదితరులు కూడా ఉన్నారు.
వీరంతా సినీ ఇండస్ట్రీలో టాప్ లో కొనసాగుతున్న వారే కావడం విశేషం. ఇదిలా ఉండగా డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో సేలంలోని సంగకిరికి చెందిన ప్రదీప్ కుమార్ , ఘానాకు చెందిన జాన్ ను చెన్నై నుంగంబాక్కం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా జరిపిన విచారణలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు నిందితులు. తాను నటుడు శ్రీరామ్ కు డ్రగ్స్ అమ్మానని చెప్పాడు. కాగా వీరి నుంచి 11 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు.