పుష్ప2 మూవీతో ఇండియన్ సినిమాను షేక్ చేసిన నటుడు ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆ తర్వాత ఏ చిత్రంలో నటిస్తున్నాడనే దానిపై ఉత్కంఠకు తెర దించాడు. రెమ్యూనరేషన్ పరంగా దర్శక, నటుడు కలిసి రూ. 300 కోట్లకు పైగానే తీసుకుంటున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిని బన్నీ, అట్లీ కొట్టి పారేయలేదు. ఇప్పటికే మూవీ షూటింగ్ ప్రారంభం కాకుండనే భారీ మార్కెట్ స్టార్ట్ కావడం విస్తు పోయేలా చేసింది. ఏకంగా ఇప్పటికే రూ. 2000 కోట్లకు వస్తున్నట్లు సినీ వర్గాల అంచనా.
ఇక రోజుకో వార్త ఏఏ22 గురించి వస్తోంది. ఈ సినిమాలో అట్లీ బన్నీతో త్రిపాత్రిభినయం చేయిస్తున్నట్లు వినికిడి. ఇందులో పలువురు హీరోయిన్లను సంప్రదించారని, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనేను కన్ ఫర్మ్ చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ ముద్దుగుమ్మ కొన్ని సినిమాలకు తను సంతకం చేసి ఉండడంతో నటిస్తుందా లేక మిగతా వాటిని విస్మరిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.
ప్రభాస్ తో కూడా నటించనున్నట్లు ప్రకటించాడు డైనమిక్ డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డి. తనతో స్పిరిట్ తీస్తున్నాడు. ఇప్పటికే ప్రాజెక్టు గురించి వెల్లడించాడు. అయితే తనకు ఎక్కువ రోజులు కావాలని ఇద్దరినీ అడిగాడని, కానీ ప్రభాస్ ఓకే చెప్పినా దీపికా ఇబ్బంది పడిందని , అన్ని రోజులు ఇవ్వలేనంటూ చెప్పిందని, దీంతో సదరు ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం.
ఇక ప్రభాస్ తో కలిసి దీపికా పదుకొనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కిలో నటించింది. ఇది బిగ్ హిట్ గా నిలిచింది. దేశ వ్యాప్తంగా రూ. 1000 కోట్లు వసూలు చేసింది. దీంతో స్పిరిట్ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, మృణాల్ ఠాకూర్ లను తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరో వైపు అట్లీ మూవీలో నటించేందుకే దీపికా పదుకొనే మొగ్గు చూపుతున్నట్లు టాక్. తనతో కలిసి జవాన్ లో నటించింది. సో బన్నీతో బ్యూటీ నటించడం ఖాయమని తేలి పోయింది.