పాన్ ఇండియా హీరోయిన్ గా పేరొందిన నటి సమంత రుత్ ప్రభు మనసులోని మాట బయట పెట్టారు. తన ప్రస్తుత లైఫ్ గురించి పంచుకున్నారు. గతంలో లేనంతగా వేదాంత ధోరణితో మాట్లాడటం ఒకింత విస్తు పోయేలా చేసింది. సినిమాలు, వెబ్ సీరీస్ లలో నటిస్తున్న సమయంలో ఎక్కడికి వెళుతున్నానో అర్థం అయ్యేది కాదన్నారు. కానీ ఎప్పుడైతే మూవీస్ నుంచి గ్యాప్ ఏర్పడిందో చాలా సంతోషంగా ఉన్నానని చెప్పింది. ఆమె తాజాగా ఓ ఛానల్ తో చిట్ చాట్ చేసింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఫ్రీగా , హాయిగా ఉన్నానని పేర్కొంది.
ఇదిలా ఉండగా గతంలో తను అక్కినేని నాగ చైతన్యతో ఉన్న బంధాన్ని తెంచుకుంది. ఆ తర్వాత ఒంటరిగానే ఉంటోంది. అయితే వెబ్ సీరీస్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్ లో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాను షేక్ చేశాయి. దానిని ఖండించ లేదు నటి. అలాగని స్పందించక పోవడం పట్ల కూడా కొంత అనుమానం వ్యక్తం అయ్యింది. ఇదే క్రమంలో చైతూ మరో నటి శోభిత ధూళిపాళకు తాళి కట్టాడు. ఆ తర్వాత తను నటించిన థండేల్ బిగ్ హిట్ గా నిలిచింది.
ఈ సమయంలో గత రెండేళ్లుగా ఏ ఒక్క సినిమా రాలేదు సమంత రుత్ ప్రభు నుంచి. ఈ విరామం వల్ల తనకు బిగ్ రిలీఫ్ కలిగిందని పేర్కొంది. విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీలో నటించింది. అది మ్యూజికల్ గా హిట్ అయినా సినిమా పరంగా బాక్సాఫీస్ వద్ద బోర్లాపడింది.
సమంత రుత్ ప్రభు నిర్మాతగా మారింది. తను తీసిన శుభం బిగ్ సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం తన స్వీయ నిర్మాణంలో మా ఇంటి బంగారం అనే మూవీలో నటిస్తోంది. హిందీలో రక్త్ బ్రహ్మాండ్ సీరీస్ తో ముందుకు రానుంది.