అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ లో అద్భుతమైన ప్రతిభతో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ను 6 పరుగుల తేడాతో ఓడించింది. విశ్వ విజేతగా నిలిచింది ఆర్సీబీ. మూడుసార్లు ఐపీఎల్ ఫైనల్ కు చేరుకుంది. కానీ గెలవలేక పోయింది. సీజన్ ప్రారంభం నుంచి నేటి 18వ సీజన్ దాకా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోనే కొనసాగాడు స్టార్ క్రికెటర్ , రన్ మెషీన్ విరాట్ కోహ్లీ. 18 సంవత్సరాల సుదీర్గ విరామం తర్వాత కోహ్లీ కల నెరవేరింది.
తను కన్నీటి పర్యంతం అయ్యాడు. మైదానాన్ని ముద్దాడాడు. ఆర్సీబీకి ఈ విజయం ఊరికే రాలేదు. ప్రత్యర్థి జట్టు పంజాబ్ చివరి బంతి దాకా పోరాడింది. ఇంకా కొన్ని బంతులు మిగిలి ఉంటే వారికే కప్ దక్కి ఉండేది.
191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ను ఆర్సీబీ బౌలర్లు బోల్తా కొట్టించారు. ప్రధానంగా చెప్పు కోవాల్సింది స్కిప్పర్ రజత్ పాటిదార్ అద్భుతమైన నాయకత్వం వహించాడు. షెపర్డ్ ను తీసుకు వచ్చి కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ను బోల్తా కొట్టించాడు. షాట్ కొట్టేందుకు ప్రయత్నం చేసి వికెట్ సమర్పించుకున్నాడు.
జోస్ ఇంగ్లీష్ , శశాంక్ సింగ్ ఆర్సీబీ బౌలర్లను ఉతికి ఆరేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. చివరి ఓవర్ లో 29 పరుగులు కావాల్సి వచ్చింది. కానీ 23 పరుగులు మాత్రమే వచ్చాయి. మొత్తంగా సీజన్ లో తీవ్ర నిరాశకు గురైంది పంజాబ్ కింగ్స్ ఎలెవన్.