రికార్డ్ సృష్టించిన మోదీ స్టేడియం

ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ కు ఫుల్ క్రౌడ్

గుజ‌రాత్ – ప్ర‌పంచంలోనే క్రికెట్ ప‌రంగా అత్య‌ధిక సీటింగ్ కెపాసిటీ క‌లిగిన ఏకైక స్టేడియం ఇండియా గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ మోదీ స్టేడియం. అధునాత‌న సౌక‌ర్యాలు, అద్భుత‌మైన స్టాండింగ్ కెపాసిటీ క‌లిగి ఉంది. దాదాపు ల‌క్ష మందికి పైగా కూర్చునేందుకు దీనిని నిర్మించారు. ఈ స్టేడియంలో కీల‌క‌మైన మ్యాచ్ లు జ‌రిగాయి. చివ‌ర‌కు ఫైన‌ల్ మ్యాచ్ ను బీసీసీఐ మొద‌ట‌గా కోల్ క‌తా లోని ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఈడెన్ గార్డెన్స్ లో నిర్వ‌హించాల‌ని అనుకుంది.

కానీ భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల కార‌ణంగా ఫైన‌ల్ మ్యాచ్ ను మార్చేశారు . భ‌ద్ర‌తా కార‌ణాల కార‌ణంగా కేంద్ర హోం శాఖ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో బీసీసీఐ కార్య‌ద‌ర్శి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఫైన‌ల్ మ్యాచ్ ను అహ్మ‌దాబాద్ కు మారుస్తున్న‌ట్లు తెలిపాడు. ఈ మేర‌కు భారీ ఎత్తున టికెట్లు అమ్ముడు పోయాయి. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో బీసీసీఐకి ఆదాయం స‌మ‌కూరింది. ప్ర‌ధానంగా దీనిని ప్ర‌సారం చేసిన జియో హాట్ స్టార్ కు కాసుల పంట పండించేలా చేసింది.

గ‌త సీజ‌న్ లో ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ కంటే ఈసారి జ‌రిగిన 18వ సీజ‌న్ ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ ను చూసేందుకు అత్య‌ధికంగా ప్రేక్ష‌కులు , ఫ్యాన్స్ హాజ‌రైన‌ట్లు బీసీసీఐ వెల్ల‌డించింది. అంత‌కు ముందు ప్ర‌ద‌ర్శించిన విన్యాసాలు, ప్రోగ్రామ్స్ కు ఐపీఎల్ కు హైలెట్ గా నిలిచాయి. శంక‌ర్ మ‌హ‌దేవ‌న్ బృందం ఆలాపించిన పాట‌లు హ‌త్తుకున్నాయి. ఇక యావ‌త్ స్టేడియం మొత్తం మా తుజే స‌లాం, వందేమాత‌రం అంటూ నినాదాల‌తో నిండి పోయాయి. మొత్తంగా ఐపీఎల్ ముగిసినా మోదీ స్టేడియం మాత్రం చిర‌స్మ‌ర‌ణీయంగా మిగిలి పోయింది.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com