గుజరాత్ – ఎయిర్ ఇండియాకు చెందిన విమానం అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అవుతూనే ఇటాన్ నగర్ లో కూలి పోయింది. ఈ ఘటనలో 265కి పైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలోనే అత్యంత విషాదకరమైన ఘటన. ఈ దుర్ఘటనలో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీతో పాటు బీజే ఆస్పత్రి క్వార్టర్స్ లో ఉంటున్న 39 మంది వైద్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇది పూర్తిగా సాంకేతిక లోపం కారణంగా చోటు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటన తర్వాత వరుసగా ఎయిర్ ఇండియాకు చెందిన ఫ్లైట్స్ లలో టెక్నికల్ ఇష్యూస్ రావడంతో పలు విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది సదరు సంస్థ. దీనిని టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. తాజాగా అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇప్పటి వరకు 220 మంది బాధితులను డీఎన్ఏ ఆధారంగా గుర్తించడం జరిగిందని ప్రకటించారు ఉన్నతాధికారులు. ఈ మేరకు గుర్తించిన వారందరిని ఆయా కుటుంబాలకు అప్పగించే పనిలో ఉన్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా మొత్తం బాధితులలో 202 మృతదేహాలను ఇప్పటికే బంధువులకు అప్పగించారు. ఈ వివరాల్లో 151 మంది భారతీయులు, 34 మంది బ్రిటిష్ జాతీయులు, 7 మంది పోర్చుగీస్ పౌరులు, 1 కెనడియన్, ప్రయాణికులు కానివారు 9 మంది ఉన్నారు.
అవశేషాల రవాణాను జాగ్రత్తగా అత్యవసరంగా నిర్వహించారు. ఇప్పటి వరకు 15 మృతదేహాలను వారి గమ్యస్థానాలకు తరలించారు, 187 మందిని అంబులెన్స్లలో రోడ్డు మార్గం ద్వారా తరలించారు. మిగిలిన మృతదేహాలను రాబోయే రోజుల్లో అందజేస్తామని అధికారులు తెలిపారు.