UPSC New Chairman : ఢిల్లీ – కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ , ఇతర అత్యున్నతమైన పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపీఎస్ సీ) చైర్మన్ గా మాజీ రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ ను నియమించింది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు చైర్మన్ గా ఉన్న ప్రీతి సుదాన్ పదవీ కాలం గత ఏప్రిల్ నెల 29న పూర్తయింది. దీంతో ఖాళీగా ఉన్న ఈ కీలక పోస్టును భర్తీ చేసింది.
UPSC New Chairman 2025 Updates
ఇదిలా ఉండగా యుపీఎస్సీలో ఇద్దరు సభ్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వు ల ప్రకారం మాజీ రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్(Ajay Kumar)ను యుపిఎస్సి చైర్మన్గా సిఫారసు చేశారు. ఈ మేరకు తన నియామకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. కాగా నూతన చైర్మన్ కేరళ కేడర్ కు చెందిన 1985 బ్యాచ్ . రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారి. ఆయన ఆగస్టు 23 , 2019 నుండి అక్టోబర్ 31, 2022 వరకు రక్షణ శాఖ కార్యదర్శిగా పని చేశారు.
దేశంలో పేరు పొందిన సర్వీసులలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ , తదితర సర్వీసులకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇందులో గరిష్టంగా 10 మంది సభ్యుల వరకు ఉంటారు.
Also Read : Randhir Jaiswal Sensational :పాక్ ఉగ్రవాద దేశంగా ప్రపంచం గుర్తించింది