ఐపీఎల్ 2025 మెగా టోర్నీ ఆఖరి అంకానికి చేరుకుంది. ఫైనల్ మ్యాచ్ గుజరాత్ లోని అహ్మదాబాద్ మోదీ స్టేడియం వేదిక కానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్ల మధ్య పోరు కొనసాగనుంది. ఆర్సీబీ పూర్తిగా విరాట్ కోహ్లీ మీద ఆధార పడింది. తను ఈ సీజన్ లో సూపర్ ఫామ్ లో కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు 14 మ్యాచ్ లు ఆడాడు. 600కు పైగా పరుగులు చేశాడు. తను గనుక మైదానంలో ఉంటే మాత్రం పంజాబ్ కు కష్టాలు మొదలైనట్టేనని చెప్పక తప్పదు.
తన కోసమైనా ఆర్సీబీకి కప్ తీసుకు రావాలన్నది తమ లక్ష్యమని స్పష్టం చేశాడు స్టాండింగ్ స్కిప్పర్ గా ఎంపికైన రజత్ పాటిదార్. ఒక్కసారి కమిట్ అయ్యాడంటే తనను ఆపడం ఎవరి తరం కాదు. ఎలాంటి బౌలర్ అయినా సరే ధాటిగా ఎదుర్కోవడం, ఫోర్లు, సిక్సర్లు కొట్టడం తనకు హాబీ. ఆర్సీబీ జట్టు పరంగా చూస్తే అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో బలంగా ఉంది .
తనకు బౌలింగ్ చేయాలంటే ప్రత్యర్థి బౌలర్లు సైతం కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు. దీనికి కారణం తన అటాకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఏ మాత్రం ఛాన్స్ దొరికినా రెచ్చి పోతాడు. కళ్లు చెదిరే షాట్స్ తో ఆకట్టుకుంటాడు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అందుకే తనకు రన్ మెషీన్ అనే పేరు వచ్చింది క్రికెట్ రంగంలో.