ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపు దిద్దుకుంటున్న మూవీలో నటిస్తున్నాడు. దీనికి డైనమిక్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా బన్నీ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొనే నటిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించాడు. ఈ మేరకు వీడియో కూడా రిలీజ్ చేశాడు. దీనికి భారీ ఎత్తున స్పందన లభించింది కూడా. ఇక అట్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే.
తన టేకింగ్, మేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. తను బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తో తీసిన జవాన్ ఏకంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. రూ. 1000 కోట్లు వసూలు చేసింది. దీంతో హిందీ హీరో, హీరోయిన్లు, ఇతర సాంకేతిక నిపుణలంతా సౌత్ సినిమా వైపు చూస్తున్నారు. ఇటీవలే అమీర్ ఖాన్ కీలక ప్రకటన చేశాడు. తన తదుపరి చిత్రం తమిళ సినీ సూపర్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో నటిస్తున్నట్లు తెలిపాడు. భారీ ఖర్చుతో అల్లు అర్జున్ తో సినిమా తీస్తున్నాడు సన్ పిక్చర్స్ అధినేత, డీఎంకే ఎంపీ దయానిధి మారన్.
ఈ మూవీ కోసం ఏకంగా రూ. 800 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు టాక్. ఇప్పటికే రూ. 1000 కోట్లకు పైగా మార్కెట్ కూడా వచ్చేసిందని టాక్. ఇంకా షూటింగ్ మొదలు పెట్టలేదు. ఇది రికార్డ్. తాజాగా బన్నీ గురించి మరో కీలక అప్ డేట్ వచ్చేసింది. అదేమిటంటే హాలీవుడ్ రేంజ్ లో రాబోతున్న అట్లీ మూవీ తర్వాత అల్లు అర్జున్ తదుపరి చిత్రం మలయాళం సినీ రంగానికి చెందిన దర్శకుడు బసిల్ జోసెఫ్. తను నటుడే కాదు అద్భుతమైన దర్శకుడిగా పేరు పొందాడు. తన దర్శకత్వంలో అట్లీ మూవీ పూర్తయ్యాక నటించనున్నాడని, దీనిని తమ బ్యానర్ నిర్మిస్తుందని టాక్. మరి ఇది వాస్తవమో తెలియాలంటే వెయిట్ చేయాలి.