మే 31న సూర్య పూజా రెట్రో నెట్ ఫ్లిక్స్ లో

ప్ర‌క‌టించిన దిగ్గ‌జ ఓటీటీ సంస్థ

కోలీవుడ్ లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజు. త‌న టేకింగ్ మేకింగ్ చాలా భిన్నంగా ఉంటుంది అంద‌రికంటే. త‌ను తాజాగా తీసిన చిత్రం రెట్రో . ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఆశించిన మేర స్పంద‌న ల‌భించింది. ఇందులో సూర్య‌, అందాల భామ పూజా హెగ్డే కీ రోల్స్ పోషించారు. మ్యూజిక్ ప‌రంగా సూప‌ర్ బిట్ టాక్ తెచ్చుకుంది. పెట్టిన డ‌బ్బులు తిరిగి వ‌చ్చాయి. ద‌ర్శ‌కుడికి మినిమం గ్యారెంటీ డైరెక్ట‌ర్ గా పేరుంది.

తెలుగు, త‌మిళ్ తో పాటు ఇత‌ర భాష‌ల్లో కూడా రిలీజ్ చేశారు. దీనిని పూర్తిగా రొమాంటిక్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కించాడు కార్తీక్ సుబ్బ‌రాజు. గ‌తంలో ఏ ద‌ర్శ‌కుడు తీయ‌ని విధంగా పూజా హెగ్డేను చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. ఎక్క‌డా అస‌భ్య‌త లేకుండా ఉండేలా చూశాడు. తాజాగా రెట్రో మూవీకి సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ఈ చిత్రాన్ని చేజిక్కించుకునేందుకు బ‌డా ఓటీటీ సంస్థ‌లు పోటీ ప‌డ్డాయి.

చివ‌ర‌కు ద‌ర్శ‌కుడిపై న‌మ్మకం ఉండ‌డంతో ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ స్వంతం చేసుకుంది రెట్రోను. ఈ మేర‌కు సినిమా స్ట్రీమింగ్ కు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈనెలాఖ‌రున అంటే మే 31న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంద‌ని వెల్ల‌డించింది. ఈ చిత్రంలో సూర్య‌, పూజాతో పాటు జ‌య‌రామ్, నాజ‌ర్, ప్ర‌కాశ్ రాజ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు పెట్టుకుంది.

Comments (0)
Add Comment