ఆస‌క్తి రేపుతున్న 8 వ‌సంతాలు

జూన్ 20న ప్రేక్ష‌కుల ముందుకు

తెలుగు చ‌ల‌న చిత్ర రంగంలో త‌మ‌కంటూ ప్ర‌త్యేక‌త క‌లిగి ఉన్నారు మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాత‌లు. జ‌యాప‌జ‌యాల‌తో నిమిత్తం లేకుండా క‌థ‌లు బాగుంటే, ద‌మ్ముండి తీస్తామంటే ప్రోత్స‌హిస్తున్నారు. మంచి సినిమాల‌ను తెర మీద‌కు తీసుకు వ‌చ్చేలా చూస్తున్నారు. అంతే కాదు వీరు నిర్మించిన బన్నీ న‌టించిన సుకుమార్ తీసిన పుష్ప సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఇండియ‌న్ సినిమాను షేక్ చేసింది. ఏకంగా రూ. 1867 కోట్లు కొల్ల‌గొట్టింది.

తాజాగా వీరు తీసిన మూవీ 8 వ‌సంతాలు. టైటిల్ డిఫ‌రెంట్ గా ఉంది. చూస్తేనే ఆక‌ట్టుకునేలా ఉంది. దీనికి ద‌ర్శ‌కుడు ఫ‌ణీంద్ర న‌ర్సెట్టి. సుదీర్ఘ కాలం త‌ర్వాత తిరిగి వ‌చ్చాడు. దాదాపు ఏడు సంవ‌త్స‌రాలైంది త‌ను మూవీ తీసి. ప్ర‌స్తుతం పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. త‌న మీద న‌మ్మ‌కం ఉండ‌డంతో మైత్రీ మూవీ మేక‌ర్స్ జ‌త క‌ట్టారు. మ‌గాడి ప్రేమ‌కు ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. మ‌రి ఆడ‌వాళ్ల‌కు లేవా ఏంటి..ఎందుకు అలా అని ప్ర‌శ్నించాడు సినిమా ద్వారా.

8 వ‌సంతాలు చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది మైత్రీ మూవీ మేక‌ర్స్. న‌వీన్ యెర్నేని, వై రవి శంక‌ర్ దీనిపై ఫోక‌స్ పెట్టారు. క‌థ బాగుండ‌డంతో ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఇక మ్యాడ్ మూవీతో లైమ్ లైట్ లోకి వ‌చ్చింది అనంతిక స‌నిల్ కుమార్ . 8 వ‌సంతాలు లో లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ సంద‌ర్బంగా కీల‌క అప్ డేట్ ఇచ్చారు మూవీ మేక‌ర్స్. జూన్ 20న ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని ప్ర‌క‌టించారు. మ‌గాళ్ల ప్రేమ‌కు ఎన‌లేని జ్ఞాప‌కాలు ఉన్నాయి..మ‌రి ఆడ‌వాళ్ల మ‌న‌సులోనే స‌మాధి చేసుకున్న జ్ఞాప‌కాలు త‌ప్పా అంటూ ప్ర‌శ్నించాడు. చూడాల్సిన సినిమా.

Comments (0)
Add Comment