Aamir Khan : మరో ఆసక్తికరమైన, అరుదైన కాంబినేషన్ తెరపైకి వస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదే నిజమైతే మాత్రం ఈ కాంబినేషన్ ఓ కొత్త చరిత్రను తిరగరాయడం కాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఖైదీ, విక్రమ్, లియో వంటి చిత్రాలతో హీరో స్థాయిలో పేరు తెచ్చుకున్న తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్, బాలీవుడ్ నటుడు, మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ఖాన్ తో ఓ పాన్ ఇండియా సినిమా ఫ్లాన్ చేస్తున్నట్లు ఈ చిత్రాన్ని టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు ఇందుకు సంబంధించి చర్చలు కూడా పూర్తయినట్లు నెట్టింట న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి.
Aamir Khan-Lokesh Kanagaraj Movie Updates
గత సంవత్సరం వచ్చిన లియో వంటి బ్లాక్ బస్టర్ తర్వాత లోకేశ్ కనగరాజ్ ప్రస్తుతం రజనీకాంత్ తో కూలీ అనే సినిమా రూపొందిస్తుండగా దాని అనంతరం కార్తీతో ఖైదీ 2 పూర్తి చేసి అమీర్ఖాన్(Aamir Khan)తో సినిమాను పట్టాలపైకి తీసుకురానున్నట్లు సమాచారం. అయితే మైత్రీ మూవీ మేకర్స్ మొదట ఈ సినిమా కోసం హృతిక్రోషన్ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆపై అమీర్ఖాన్తో స్టోరీ డిస్కస్ చేసి మూవీని ఫైనల్ చేసినట్లు టాక్ నడుస్తోంది. 2022లో వచ్చిన లాల్ సింగ్ చడ్డా సినిమా అనంతరం కాస్త గ్యాప్ తీసుకున్న అమీర్ ఖాన్ ప్రస్తతం సితారే జమీన్ ఫర్ అనే స్పోర్ట్స్ డ్రామా సినిమాలో నటిస్తూ, నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ఈ క్రిస్మస్కు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.
Also Read : Ananya Panday : నాకు నటన రాకుంటే అంతటితో ఆగి పోయే దాన్ని